సి.ఆర్.పి విధులను పకడ్బందీగా నిర్వహించాలి....జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
*3 రోజుల గైర్హాజరైన పిల్లల వివరాలు సేకరించి తల్లిదండ్రులను ఫాలో అప్ చేయాలి
*వారం లో ఒక రోజు పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలి
*విద్యా శాఖ వర్క్ అడ్జెస్ట్ మెంట్, పాఠశాలల నిర్వహణ పై సమీక్షించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, లోకల్ గైడ్:
సి.ఆర్.పి విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత విద్యా శాఖ అధికారులు, సి.ఆర్.పిలతో విద్యా శాఖ వర్క్ అడ్జెస్ట్ మెంట్, పాఠశాలల నిర్వహణ పై సమీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జిల్లా పరిధిలో ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయుల వర్క్ అడ్జెస్ట్ మెంట్ పారదర్శకంగా జరగాలని ఎటువంటి పైరవీలకు ఆస్కారం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని, ఉన్నత పాఠశాలలో అన్ని సబ్జెక్టుల టీచర్లు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బడి బాట కార్యక్రమం ద్వారా పెరిగిన విద్యార్థుల సంఖ్య అనుగుణంగా అదనపు తరగతుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ సూచించారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సి.ఆర్.పి). నిబంధనల ప్రకారం వారి విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి సి.ఆర్.పి మూమెంట్ రిజిస్టర్, టూర్ డైరీ మేయింటేన్ చేయాలని అన్నారు. సి.ఆర్.పి లు ఇక నుంచి ప్రతి నెలా అడ్వాన్స్ టూర్ డైరీ తయారు చేసుకోవాలని అన్నారు. ప్రతి రోజు కాంప్లెక్స్ పరిధిలో ఏదైనా ఒక పాఠశాలలో ప్రేయర్ టైంలో పాల్గోన్నాలని అన్నారు. యూ.డి.ఐ.డి లలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఎటువంటి తప్పుడు సమాచారం ఉండకుండా ఎప్పటికప్పుడు వివరాలను 24 గంటల్లో అప్ డేట్ చేయాలని కలెక్టర్ సి.ఆర్.పి లను ఆదేశించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను సి.ఆర్.పి లు సంబంధిత ఏ.ఈ లను ఫాలో అప్ చేస్తూ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.పాఠశాలకు 3 రోజుల కంటే వరుసగా హాజరు కాని విద్యార్దుల జాబితా పాఠశాలల నుంచి తీసుకుంటూ, వారి తల్లి తండ్రులను ఫాలో అప్ చేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, పంచాయతీ కార్యదర్శులతో సమయం చేస్తూ పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో కనీసం 60 శాతం కంటే అధికంగా పేరెంట్స్ హజరయ్యేలా చూడాలని అన్నారు. ప్రభు తో పాఠశాలల్లోని విద్యార్థులకు ఎక్కడైనా పాఠ్యాంశాలు ఏకరూప దుస్తులు లోటు ఉంటే ఆ జాబితా అందించాలని అన్నారు. వారానికి ఒక రోజు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజన నాణ్యతను పరిశీలించాలని అన్నారు. మండల కేంద్రాల్లో ఉన్న భవిత కేంద్రాలను సైతం సి.ఆర్.పి లు తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో జి.సి.డి.ఓ కవిత, ఎస్.ఓ మల్లేష్, పీ.ఎం. షేక్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.