భూభారతి రెవెన్యూ సదస్సు ఎన్కతల  గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి 

భూభారతి రెవెన్యూ సదస్సు ఎన్కతల  గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి 

- భూభారతి 
భూ సమస్యలను సాధ్యమైనంత వరకు రెవెన్యూ సదస్సులోనే పరిష్కరించాలి.

 మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి 

 మోమిన్ పేట్ తహసిల్దార్ రవీందర్

వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్ తెలంగాణ :

 మోమిన్ పేట్ మండల పరిధిలోని  సోమవారం ఎన్కతల గ్రామపంచాయతీలో  నిర్వహించిన రెవెన్యూ సదస్సును వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి  సందర్శించారు. అర్జీదారుల సమస్యలను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని  తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలను దరఖాస్తులు  ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారా?అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.వివరాల నమోదులో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ నమోదు
రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపర్చాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే  పరిష్కరించాలని అన్నారు.    ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని సూచించారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్ధమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు. 
సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలి ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రవీందర్ గ్రామ సెక్రెటరీ నరసింహులు, రెవెన్యూ సిబ్బంది, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోయ శ్రీశైలం, గ్రామపంచాయతీ కారబర్ కట్టేల నాగరాజు, ఎన్కతల మాజీ సర్పంచ్ మినేపల్లి అనంతయ్య ఏఎన్ఎం మంజుల ఆశా వర్కర్లు సుజాత, అండాలు వనిత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా... సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
  ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది... జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి... నిజామాబాద్,(లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...
రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం 
సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ...