భారత క్రికెట్‌లో కొత్త అధ్యాయం: గిల్ ‘ప్రిన్స్‌’గా నిలుస్తాడా?

భారత క్రికెట్‌లో కొత్త అధ్యాయం: గిల్ ‘ప్రిన్స్‌’గా నిలుస్తాడా?

‘పాత నీరు పోయాలి... కొత్త నీరు రావాలి’ అని ఒక సామెత. ఈ మాటలు ఇప్పుడు భారత క్రికెట్‌కి సరిగ్గా సరిపోతున్నాయి. అద్భుతమైన ఆటతీరు, అసాధారణ నాయకత్వం ద్వారా దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్లు ఎందరో. తరాలు మారినా వారి వారసత్వం కొనసాగుతూనే ఉంది. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లలో ప్రత్యర్థులపై సవాలు విసురుతూ, దేశం-విదేశం తేడా లేకుండా జైత్రయాత్ర సాగించిన వారు ఎందరో!

తాజాగా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, అశ్విన్‌ లాంటి దిగ్గజాలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం భారత క్రికెట్‌లో ఒక పెద్ద మార్పుకు ఆరంభం. ఒక్క వారం వ్యవధిలో రోహిత్‌-కోహ్లీ రిటైర్మెంట్స్, అంతకుముందే ఆస్ట్రేలియాలో అశ్విన్‌  రిటైర్మెంట్‌ ప్రకటించడం— ఇవన్నీ టీమ్‌ఇండియాను కీలక మలుపులోకి తీసుకొచ్చాయి.

ఈ సందర్భంలో సరికొత్త నాయకత్వాన్ని బోర్డు ముందుకు తెచ్చింది. అందరి ఊహలకు భిన్నంగా బుమ్రాకు బదులుగా యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌కు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ నిర్ణయం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించినా, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్నదే.

 గతంలోనూ ఇదే పరిస్థితి
గంగూలీ నుంచి ధోనీ, ధోనీ నుంచి కోహ్లీ, కోహ్లీ నుంచి రోహిత్‌— ప్రతి మార్పు సమయంలోనూ ఇలాగే ప్రశ్నలు, ఆశలు. నాయకత్వ మార్పు టీమ్‌ఇండియాకు కొత్తకాదు. కానీ దిగ్గజాల లోటును కొత్త తరం ఎంతవరకు పూడుస్తుందన్నది ఎప్పుడూ మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే ఉంటుంది.
ఇంగ్లండ్ సిరీస్‌: గిల్‌కి ‘లిట్మస్‌ టెస్టు’
ఇప్పుడు టీమ్‌ఇండియా ఇంగ్లండ్‌ పేస్‌ పిచ్‌లపై ఐదు టెస్టుల సిరీస్‌ ఆడబోతోంది. ఇది వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (2025–27) కొత్త సైకిల్‌కు ఆరంభం. గిల్‌కి ఇది ఒక ‘లిట్మస్‌ టెస్టు’ లాంటిదే. అతడికి ఐపీఎల్‌ (గుజరాత్‌ టైటాన్స్‌)లో నాయకత్వం చేసిన అనుభవం ఉన్నా, అంతర్జాతీయ టెస్టు కెప్టెన్సీలో మాత్రం అనుభవం చాలా తక్కువే. ఐదు టీ20ల్లో మాత్రమే భారత్‌కు కెప్టెన్‌గా నిలిచాడు.
ఇంగ్లండ్‌ కండిషన్స్‌, డ్యూక్‌ బంతుల స్వింగ్‌, మారుముఖపు వాతావరణం— ఇవన్నీ భారత యువ బ్యాటర్లకు పెద్ద సవాలే. ఇంతవరకు గిల్‌ ఇంగ్లండ్‌లో 3 టెస్టులు ఆడి 6 ఇన్నింగ్స్‌ల్లో అతిపెద్ద స్కోరు 28 మాత్రమే. ముఖ్యంగా ఎక్కువగా డ్రైవ్‌ షాట్లు ఆడే గిల్‌కి అవే ప్రత్యర్థులకు అవకాశం కల్పిస్తే చాలు, పేస్ బౌలర్లకు అవి వరం అవుతాయి.
ఇప్పటి వరకు మిశ్రమ ఫలితాలు
రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత చీఫ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. టెస్టుల్లో ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌, ఆ తర్వాత ఆస్ట్రేలియాపై బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ చేజారడం— ఇవన్నీ టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి.
‘ప్రిన్స్‌’ నిజంగా పనిచేస్తాడా?
సచిన్‌ను ‘గాడ్‌’, కోహ్లీని ‘కింగ్‌’గా గౌరవించిన అభిమానులు ఇప్పుడు గిల్‌ను ‘ప్రిన్స్‌’ అంటూ ముద్దుగా పిలుస్తున్నారు. ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం జరిగిన ఫోటోషూట్‌లో గిల్‌ బ్యాట్‌పై ‘ప్రిన్స్‌’ పదం అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు అభిమానులు గిల్‌ నుంచి రోహిత్‌ లాంటి స్టయిల్‌, కోహ్లీ లాంటి దూకుడు ఆశిస్తున్నారు.
కెప్టెన్సీతో పాటు, బ్యాటింగ్‌లోనూ అదరగొడతాడా? ప్రధానంగా నాలుగో స్థానంలో కోహ్లీ స్థానాన్ని నింపగలడా? ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సింది గిల్‌. 2007 తర్వాత ఇంగ్లండ్‌లో సిరీస్‌ గెలవని టీమ్‌ఇండియా, ఈసారి గిల్‌ నాయకత్వంలో చరిత్ర తిరగరాయగలదా అనేది చూడాలి.

ఇక మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ గిల్‌కు, భారత క్రికెట్‌కు నిజమైన పరీక్ష. ‘ప్రిన్స్‌’ చరిత్ర సృష్టిస్తాడో లేదో చూద్దాం!

Tags:

About The Author

Advertisement

Latest News

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్‌ (FASTag) వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కొత్త ఫాస్టాగ్ పాలసీని...
భీమ్స్ చేతికి విశ్వంభ‌ర?
అంగవైకల్యం అనేది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం..
ప్రతిష్టాత్మక ఏఐ సదస్సులో గీతం ప్రాతినిధ్యం
మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వివేక్ వెంకటస్వామికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు 
చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య కు ఆసుపత్రిలో డైట్ కాంట్రాక్ట్...జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష
జిన్నారం మండల రైతులతో ప్రత్యక్ష సంభాషణ