జిన్నారం మండల రైతులతో ప్రత్యక్ష సంభాషణ
-పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గోదావరి
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పఠాన్ చేరు నియోజకవర్గం జన్నారం మండలం సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి ఆదేశాల మేరకు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిన్నారం మండలం మాదారం అనంత రెడ్డి గార్డెన్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంపీ రఘునందన్ రావు, కరీంనగర్ ఎమ్మెల్సీ డాక్టర్ సి అంజిరెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యనాయకులు మాట్లాడుతూ..కేంద్రంలో నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన నేపథ్యంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతులకు అనుకూల నిర్ణయాలు రైతు సంక్షేమ పథకాలను రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆదెల్లి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాపరెడ్డి, వెంకట నరసింహారెడ్డి, పోచారం రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కోల్కూర్ రాజశేఖర్ రెడ్డి, మాణిక్ రావు, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా రాష్ట్ర నాయకులు, రైతు సంఘాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.