ప్రతిష్టాత్మక ఏఐ సదస్సులో గీతం ప్రాతినిధ్యం

ప్రతిష్టాత్మక ఏఐ సదస్సులో గీతం ప్రాతినిధ్యం

లండన్ సమావేశంలో విశిష్ట అతిథిగా పాల్గొని

-ప్రసంగించిన ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్

-పరిశోధనా పత్రాన్ని సమర్పించి అంతర్జాతీయ నిపుణుల

-ప్రశంసలందుకున్న గీతం విద్యార్థులు

పఠాన్ చేరు, (లోకల్ గైడ్): గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదులోని సీఎస్ఈ విభాగం అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ ఇటీవల లండన్ లో నిర్వహించిన కృత్రిమ మేధస్సు (ఏఐ) సదస్సులో విశిష్ట అతిథిగా పాల్గొని, కీలకోపన్యాసం చేశారు. ఈ విషయాన్ని గీతం వర్గాలు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.
యునైటెడ్ కింగ్ డామ్ (లండన్)లో ఈ నెలలో (జూన్) జరిగిన 13వ అంతర్జాతీయ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ థియరీ అండ్ అప్లికేషన్స్ (ఎఫ్ఐ సిటీఏ-2025) సదస్సులో ఆమె గీతంకు ప్రాతినిధ్యం వహించినట్టు తెలియజేశారు. లండన్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ (ఏఐ అండ్ డీఎస్) పరిశోధనా బృందం నిర్వహించిన ఈ సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు పాల్గొన్నట్టు వెల్లడించారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ లో ఎదురయ్యే సవాళ్లు, వాటి వినియోగంపై గీతం అధ్యాపకురాలు ప్రొఫెసర్ పర్వేకర్ కీలకోపన్యాసం చేశారన్నారు. విభిన్న పరిశ్రమలలో ఏఐ-ఎంఎల్ యొక్క క్లిష్టమైన పురోగతులు, వాస్తవ-ప్రపంచ వినియోగాలను ఆమె వివరించినట్టు తెలిపారు.
సెర్బియాలోని సింగిడునమ్ విశ్వవిద్యాలయంలో ఆతిథ్య ఉపన్యాసకురాలిగా కూడా సేవలందిస్తున్న ప్రొఫెసర్ పర్వేకర్, అంతర్జాతీయ విద్యాపరమైన సంబంధాలు, సహకారాలకు ఊత మిస్తోందన్నారు. ప్రొఫెసర్ పర్వేకర్ మార్గదర్శనంలో సీఎస్ఈ చివరి ఏడాది విద్యార్థులు జి.సోహన్ కుమార్ రెడ్డి, ఆదిచేతన్ ఖోట్, టి.ఆశ్రిత్, బి.మణిచరణ్ రెడ్డి తదితరులు ఈ-కామర్స్ సైట్ల కోసం ఆటోమేటిక్ ధర పర్యవేక్షణ అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించినట్టు తెలియజేశారు. ఈ పత్ర రూపకల్పన కోసం వారు చేసిన కృషి, దాని ఔచిత్యం, అందులోని ఆవిష్కరణలు అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు పొందాయన్నారు.ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలో గీతం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని పరిశోధన, ఆవిష్కరణ, ప్రపంచ విద్యా కార్యకలాపాలలో రాణించడం గీతం యొక్క నిబద్ధతను ప్రస్ఫుటీకరిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

*ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.. *ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు...
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యేను ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ...
ఈనాటి బాలలే రేపటి పౌరులు
అలరించిన చిరుతల   రామాయణం
పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్న టీఎస్ ఆర్టిసి
సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన
కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్  సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ