వ‌న్డే ప‌గ్గాలు కూడా గిల్ కేనా ???

వ‌న్డే ప‌గ్గాలు కూడా గిల్ కేనా ???

లోక‌ల్ గైడ్ : రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత, భారత టెస్టు కెప్టెన్‌గా శుభ్మన్ గిల్ బాధ్యతలు స్వీకరించాడు. వన్డేల్లో రోహిత్ ఇప్పటికీ కెప్టెన్‌గా కొనసాగుతుండగా, టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్‌కి వన్డే కెప్టెన్సీ ఇవ్వొచ్చన్న చర్చలు కూడా జరుగుతున్నాయి.అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ, మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉండకూడదన్న దృష్టితో, వన్డే కెప్టెన్సీ కూడా శుభ్మన్ గిల్కే అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్ నాటికి రోహిత్ 40 ఏళ్లవుతాడు. అప్పటివరకు అతని ఫామ్, ఫిట్నెస్ ఎలా ఉంటాయన్నది అనిశ్చితం.ఈ నేపథ్యంలో గిల్‌కు వన్డే జట్టు నాయకత్వ బాధ్యతలు ఎప్పుడు అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అసలే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ వన్డేలకు గుడ్‌బై చెప్పుతాడని బీసీసీఐ అంచనా వేసినప్పటికీ, టెస్టులకు రిటైరైన రోహిత్ మాత్రం వన్డేల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.

Tags:

About The Author

Advertisement

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన