కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్ సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ
ఎమ్మెల్యే డా.భూక్యా మురళీ నాయక్
మహబూబాబాద్ జిల్లా
( లోకల్ గైడ్)
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మహబూబాబాద్ పట్టణం,మహబూబాబాద్ మండలల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రముఖ సంక్షేమ పథకాలలో భాగంగా, కల్యాణలక్ష్మి - షాదీ ముబారక్ పథకం కింద మొత్తం 107మంది లబ్దిదారులకు రూ.1,082,412రూ, విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మరో 69 మంది లబ్ధిదారులకు రూ. 21,17,00 రూ, విలువైన సీఎం సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్ స్వయంగా అందజేశారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారాబంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సామాజిక న్యాయానికి ప్రతీక అని పేర్కొన్నారు. పేద కుటుంబాల్లో పెళ్లిళ్ల సమయంలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి వర్గానికి న్యాయం చేయాలనే ధ్యేయంతో అనేక సంక్షేమ పథకాలు రూపొందించి, విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు..ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతీ కుటుంబానికి వెలుగు చేకూర్చే విధంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. ప్రజలు ప్రభుత్వ పథకాలపై విశ్వాసం ఉంచి, పూర్తి సద్వినియోగం చేసుకోవాలన్నారు..అందరం కలిసి కట్టుగా పని చేద్దాం పార్టీని బలోపేతం చేసుకుందాం...పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి...
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, జిల్లా నాయకులు,మండల నాయకులు, పట్టణ నాయకులు,స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్దిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెక్కులు అందుకున్న లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజోపయోగ చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు..