ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను
రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఆర్.ఎం.పి పి.ఎం.పి అసోసియేషన్ ప్రతినిధులు...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్).... నిజామాబాద్ ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యుల అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ను మర్యాదపూర్వకంగా కలిశారు.. రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపి పిఎంపి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ , ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్.ఎం.పి పిఎంపి వైద్యుల సమస్యలను పరిష్కరించాలని ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని అధ్యక్షులు రమేష్, ఏం హేచ్ ఐ రాజేందర్ రెడ్డి, ఆర్.ఎం.పి పి.ఎం.పి అసోసియేషన్ ప్రతినిధులు బాల బ్రహ్మచారి జి. బాలరాజు, పుల్గం మోహన్, చంద్రం లు పాల్గొన్నారు.