దానిమ్మ పండు తొక్కలను వదిలేయకండి... అందులో ఎన్నో లాభాలు దాగున్నాయి!
దానిమ్మ పండు తింటే ఆరోగ్యానికి ఎంత మంచో అందరికీ తెలిసిందే. కానీ అందులోని తొక్కలను కూడా వాడితే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం సాధారణంగా పండు తిన్న తర్వాత తొక్కను విసిరేస్తాం. కానీ ఆ తొక్కతో టీ లేదా కషాయం తయారు చేసి తాగితే ఎన్నో వ్యాధులను నివారించవచ్చు.
ఆర్థరైటిస్, నొప్పులకు ఉపశమనం
దానిమ్మ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి కణాలను రక్షిస్తాయి. దాంతో శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గి ఆర్థరైటిస్కి ఉపశమనం లభిస్తుంది. చర్మానికి ముడతలు రాకుండా చూసి యవ్వనాన్ని నిలుపుతాయి.
గుండె ఆరోగ్యానికి రక్షణ
దానిమ్మ తొక్కల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దాంతో రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రిస్క్ తక్కువ అవుతుంది. అంతేకాకుండా రక్తంలో షుగర్ లెవల్స్ను కూడా నియంత్రిస్తాయి. దీర్ఘకాలంగా తాగితే డయాబెటిస్ను అదుపులో ఉంచవచ్చు.
జీర్ణ సమస్యలకు మంచిది
తొక్కల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. తొక్కల టీని తరచూ తాగితే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
ఇన్ఫెక్షన్లు, జ్వరం కూడా తగ్గిస్తాయి
దానిమ్మ తొక్కలలో యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉండటం వల్ల శరీరంలోని హానికర బ్యాక్టీరియా, వైరస్లను దూరం చేస్తాయి. జ్వరం వచ్చినప్పుడు ఈ టీ తాగితే త్వరగా కోలుకోవచ్చు. కొన్ని రకాల క్యాన్సర్ రాకుండా కాపాడే శక్తి కూడా ఈ తొక్కలకు ఉంది.
ఎలా తాగాలి?
దానిమ్మ పండు తొక్కలను శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరగజేసి కషాయం చేసుకోవాలి. ప్రతిరోజూ ఈ కషాయాన్ని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.