సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది...
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి...
నిజామాబాద్,(లోకల్ గైడ్)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ పై అంతస్తులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.. ఈ యోగా దినోత్సవంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి మరియు జిల్లా అదనపు న్యాయమూర్తి హరీషా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ రావు మరియు న్యాయవాదులు కోర్టు సిబ్బంది ఆయా శాఖల అధికారులు పాల్గొని యోగా గురువు నేపథ్యంలో యోగాసనాలు వేశారు... నిత్యం యోగా చేయడం ద్వారా కలిగే మనశ్శాంతి, శారీరక మానసిక దృఢత్వం నాడీ వ్యవస్థ ఇతర విషయాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు యోగా గురువు చౌదరి తెలియజేశారు.. యోగ అనేది చాలా ప్రాచీనమైనదని చాలా గొప్పదని తెలిపారు.. పూర్వకాలంలో యోగా ద్వారా ఆయుర్వేద మూలికల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేవారని సూచించారు.. యోగా వల్ల చాలా తక్కువ స్థాయిలో ఆసుపత్రిలో కెమికల్ తో కూడిన మెడిసిన్స్ వాడే వారే కాదని వారు అన్నారు.. అసలు ఒక దివ్య ఔషధంగా యోగాను చెప్పుకోవచ్చన్నారు..ప్రస్తుతం ప్రపంచం అంతా యోగాను ఆదరిస్తున్నా రన్నారు..యోగా పుట్టిన గడ్డ మన భారతదేశం.. విదేశీయులు యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందుతున్నారు. విదేశీ గడ్డపై యోగా సాధన చేస్తూ, శాంతిని పొందుతున్న వారిని చూస్తే, ఈ నేలపై పుట్టిన మనం యోగాకు ఇంకా ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఆలోచించుకోవాల్సిన ఎంతైనా ఉందన్నారు.. ఈ యోగా దినోత్సవ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ మాణిక్ రాజ్, న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, సుదర్శన్, ప్యారా లీగల్ వాలంటీర్లు, జిల్లా కోర్టు అధికారులు సిబ్బంది ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..