కుమ్మర్ల తొలి బోనం పండుగను జయప్రదం చేయండి
తెలంగాణ కుమ్మర సంఘం. 880/2014 రాష్ట్ర శాఖ అధ్యక్షులు & తెలంగాణ ఎకానమిక్ ఫోరం అధ్యక్షులు నేదునూరి కనకయ్య పిలుపు
తెలంగాణ కుమ్మర్ల సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక కళావైభవాన్ని చాటడంలో బోనాలు చారిత్రిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయని అనాదిగా గోల్కొండలో అమ్మవారికి కుమ్మరి కుండలో (మట్టికుండలో) అన్నం వండి కుమ్మర్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే సాంప్రదాయం ఉంది.ఆషాడ మాసంలో అమ్మవార్లకు కుమ్మర్లు మొదటి బోనాన్ని సమర్పించే కుమ్మర్ల తొలి బోనం పండుగ తేదీ జూన్26 తారీఖు (శుక్రవార నాడు) ఉదయం 8గంటలకు జరిగే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో ఉన్న కుమ్మర్లందరు అధిక సంఖ్యలో హాజరు కావాలని తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య పిలుపునిచ్చారు.నేడు శ్రీ లక్ష్మినగర్ జిహెచ్ఎంసి పార్కులో తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ రూపొందించిన ఆహ్వాన బ్రోచెర్ను ఆవిష్కరించిన అనంతరం తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర శాఖ అధ్యక్షులు & తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు నేదునూరి కనకయ్యమాట్లాడుతూ ఆషాడ మాసంలో జరుగు బోనాల ఉత్సవాల్లో ప్రతి గ్రామంలో పట్టణంల్లో కుమ్మర్లు మొదటి బోనాన్ని అమ్మవారికి సమర్పించి కుమ్మర్ల ఐక్యత సాంస్కృతిక వైభవాన్ని చాటడంలో భోనాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. గోల్కొండ బోనాలకు రాష్ట్ర నలుమూలల నుండి కుమ్మర్లు అధిక సంఖ్యలోపాల్గొని కుల ఐక్యతను చాటి ఉత్సవాలను విజయవంత చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ ఉత్సవ సమితి చైర్మెన్ కాకులారం శంకర్ కృష్ణ,గోల్కొండ కుమ్మర్ల బోనాల ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి & తెలంగాణ కుమ్మర సంఘం 2014 రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ' గోల్కొండ కుమ్మర్ల బోనాల ఉత్సవ సమితి కోశాధికారి ధామ సత్యనారాయణ సోషల్ వర్కర్ బ్రహ్మయ్య నాయుడు పర్యావరణ వేత్త తిమ్మారెడ్డి యోగ సెంటర్ ప్రతినిధి మిట్టపల్లి నర్సింహారావు వాకర్ అసోసియేషన్ ప్రతిధి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.