రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహం వాయిదా!
సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ మరియు టీ20 క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. లక్నోలో జూన్ 8న ఘనంగా ఎంగేజ్మెంట్ వేడుక నిర్వహించగా, ఆ కార్యక్రమానికి మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, నటి జయా బచ్చన్, భువనేశ్వర్ తదితరులు హాజరయ్యారు.అయితే, ఈ జంటకు నవంబర్ 19న వివాహం జరగాల్సి ఉండగా, అది వాయిదా పడిందని సమాచారం. హిందీ మీడియా ప్రకారం, రింకూ సింగ్కు క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇరువైపు కుటుంబాలు కూడా ఈ వాయిదాకు అంగీకారం తెలిపాయని తెలుస్తోంది.వారి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుందని, తుది తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టు సమీప వర్గాలు చెబుతున్నాయి. మొదటగా వారణాసిలోని తాజ్ హోటల్ను పెళ్లి కోసం బుక్ చేసినా, ఇప్పుడు ఆ బుకింగ్ను ఫిబ్రవరి చివరకు మార్చినట్టు సమాచారం.కాగా, రింకూ సింగ్ ఐపీఎల్లో కేకేఆర్కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ప్రియా సరోజ్ సమాజ్వాదీ పార్టీ టికెట్పై మచిలీషహర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు.