రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ వివాహం వాయిదా!

రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ వివాహం వాయిదా!

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ మరియు టీ20 క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. లక్నోలో జూన్ 8న ఘనంగా ఎంగేజ్‌మెంట్ వేడుక నిర్వహించగా, ఆ కార్యక్రమానికి మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, నటి జయా బచ్చన్, భువనేశ్వర్ తదితరులు హాజరయ్యారు.అయితే, ఈ జంటకు నవంబర్ 19న వివాహం జరగాల్సి ఉండగా, అది వాయిదా పడిందని సమాచారం. హిందీ మీడియా ప్రకారం, రింకూ సింగ్‌కు క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇరువైపు కుటుంబాలు కూడా ఈ వాయిదాకు అంగీకారం తెలిపాయని తెలుస్తోంది.వారి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుందని, తుది తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టు సమీప వర్గాలు చెబుతున్నాయి. మొదటగా వారణాసిలోని తాజ్ హోటల్‌ను పెళ్లి కోసం బుక్ చేసినా, ఇప్పుడు ఆ బుకింగ్‌ను ఫిబ్రవరి చివరకు మార్చినట్టు సమాచారం.కాగా, రింకూ సింగ్ ఐపీఎల్‌లో కేకేఆర్కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ప్రియా సరోజ్ సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై మచిలీషహర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు.

Tags:

About The Author

Advertisement

Latest News

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా.  ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
నేను సైతం.    -మన్నెంలో 'రాహుల్ రేలా'                                             -అడవి బిడ్డలకు కొండంత అండ.                          -గిరిజన ప్రగతికి కీలక అడుగులు.                            -పదునైన ప్రణాళికలతో ఫలితాలు.                          -ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్...
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్
స్ట్రాబెర్రీలు.. చిన్న పండ్లు, గొప్ప లాభాలు!
మహేష్‌ బాబు డెడికేషన్‌ నాకు పాఠం లాంటిది: త్రిష
రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ వివాహం వాయిదా!
ఎమ్మెల్యే నాయిని కి కృతజ్ఞతలు