ఎమ్మెల్యే నాయిని కి కృతజ్ఞతలు
__ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు.
హనుమకొండ (లోకల్ గైడ్):
మున్నూరు కాపు భవన నిర్మాణం కోసం 7 కోట్ల 5 లక్షల రూపాయలు మంజూరు చేసి, శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు... హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులతో కల్సి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. 15 ఏండ్ల మున్నూరు కాపు భవన నిర్మాణం కల ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నెరవేర్చరాని తెలిపారు. ఎన్నికలలో గెలవాలని కులం కార్డు అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన వాళ్లకు బుద్ది చెప్పేలా ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని చెప్పారు.50 వేల అతి పెద్ద ఓటు బ్యాంకు ను స్వార్థం కోసం వాడుకున్న గత పాలకులకు చెంప పెట్టులా... ఆరు నెలలో భవనం పూర్తి చేసుకుంటామని చెప్పారు... గెలిచిన 2 ఏండ్ల లోపు అనేక అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని... చెప్పారు... మున్నూరు కాపు కులాన్ని అడ్డుపెట్టుకొని అందలం ఎక్కి... నిర్లక్ష్యా నికి గురి చేశారాని... అక్షే పించారు... ఈ సమావేశంలో కార్పొరేటర్ మానస రాం ప్రసాద్, మాజీ కార్పొరేటర్ నాగరాజు, నాయకులు పవన్ తోట, సురేందర్, లక్ష్మణ్, మనోహర్, సతీష్, పున్నం చందర్, రాజ్ కుమార్, రాకేష్, కుమార్ యాదవ్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు..