ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 

-- ప్రజలకి అందించిన సేవలు మెమోరియల్.

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 

నేను సైతం.   

-మన్నెంలో 'రాహుల్ రేలా'                              
               
-అడవి బిడ్డలకు కొండంత అండ.                         

-గిరిజన ప్రగతికి కీలక అడుగులు.                           

-పదునైన ప్రణాళికలతో ఫలితాలు.                         

-ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్ మార్క్.                      

-రాహుల్ రాకతో ఐటీడీఏ అభివృద్ధి ఉరకలు..                         

భద్రాచలం లోకల్ గైడ్ న్యూస్ :భద్రాచలం ఐటీడీఏ పీవో గా బాధ్యతలు చేపట్టి జూన్ 25 తో సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంగా పిఓ రాహుల్ పాలన సక్సెస్ స్టోరీ ..

ఆరడుగుల బుల్లెట్. అభివృద్ధిలో రాకెట్. అఖిల భారత విజ్ఞాన ఖని. తెలుగు కవి.అడవి బిడ్డలకు అండదండ.మన్యమంతా రేలా జెండా. ఆయనే యువ ఐఏఎస్ ఆఫీసర్ 'గిరిజన బాంధవుడు' బి.రాహుల్.సక్సెస్ కు కేరాఫ్. భద్రాచలం ఐటిడిఎ పిఓగా ఏడాది కాలంలోనే అద్భుతాలు సృష్టించి...మరో 'అల్లూరి'గా గిరిజనులకు అండగా నిలిచారు

 రాహుల్ రాకతో మన్యానికి మహర్దశ...

భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా యువ ఐఏఎస్ ఆఫీసర్ బి.రాహుల్ 2024 జూన్ 25న బాధ్యతలు చేపట్టారు. చూడటానికి వయస్సులో చిన్నవాడైన బహు మేధావి. ప్రతీ పని ప్రణాళికలతోనే ముందడుగు వేశారు.తత్ఫలితంగా సత్ఫలితాలు సాధించారు. మన్యానికి రాహుల్ రాక ఏజెన్సీకి మహర్దశ పట్టిందని చెప్పవచ్చు   

 విద్యా ప్రగతికి విశేషంగా కృషి...

గిరిజన ప్రగతి విద్యతోనే సాధ్యమవుతుందని విశ్వసించారు. అందుకే తన ఏడాది పాలనలో విద్య పైన ప్రధాన దృష్టి సాధించారు. విద్యాభివృద్ధికి కంకణ బద్ధులై అనేక విప్లవాత్మక విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు. ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, ఫ్రీ మెట్రిక్ హాస్టల్స్, జిపిఎస్ పాఠశాలలో ఇలా దాదాపు 348 విద్యాసంస్థల్లో చదువుతున్న దాదాపు 30,854 మంది బాలబాలికల విద్యా ప్రగతికి తనదైన శైలిలో పావులు కదిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో 32 గిరిజన గురుకుల విద్యాలయాలలో విద్యనభ్యసిస్తున్న దాదాపు 12,897 మంది విద్యార్థినీ, విద్యార్థుల  అభ్యున్నతికి అహర్నిశల పాటుపడ్డారు. ప్రాథమిక దశలో సరైన పునాది పడితే అది ప్రగతికి దోహదపడుతుందని విశ్వసించిన పిఓ రాహుల్ ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థుల నైపుణ్యం పెంపుదలకు ఉద్దీపకం వర్క్ బుక్కులను అందుబాటులోకి తీసుకొచ్చారు. పిల్లలకు కష్టంగా ఉండే గణితము, ఆంగ్లం తదితర సబ్జెక్టులలో నిష్ణాతుల చేత వర్క్ బుక్కులను తయారు చేపించి గిరి బిడ్డలకు పటిష్టమైన విద్యను అందిస్తున్నారు. పిఓ చర్యలతో నేడు గిరి పిల్లలు వేదిక్ మాథ్స్ మరియు ఆంగ్ల భాష నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధనకు ప్రతి పాఠశాలకు ప్రత్యేక అధికారులను నియమించడంతో ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో దాదాపు 26 స్కూల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించటం గమనార్హం. టెన్త్ బాల బాలికలకు స్పెషల్ మెనూ, గ్రాఫ్, మ్యాప్ పాయింటింగ్, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, మెటల్ స్కేళ్ళు, ఎగ్జామ్ ఫ్యాడ్, జామెంట్రీ బాక్స్ తదితర అత్యవసరాలను అందించి టెన్త్ పిల్లలను ఎంతగానో ప్రోత్సహించటం జరిగింది. దీంతో సత్ఫలితాలు సాధించటం విశేషం. ఐటీడీఏ స్థాయిలో పదవ తరగతి బాల బాలికలకు  ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష 2025 నిర్వహించి ప్రత్యేక ప్రోత్సాహం అందించటం జరిగింది. తరచూ విద్యాసంస్థలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఆయా విద్యా సంస్థల నిర్వాహకులను అలర్ట్ చేయడం జరిగింది. పాఠశాలల తనిఖీ సందర్భంలో స్వయంగా పిల్లలకు పాఠాలు బోధించి, తగు మెలకువలు చూపించి వారిని ప్రోత్సహించిన సందర్భాలు కోకొల్లలు. విద్య సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. మరమ్మత్తుల పనులకు ఒక్కో విద్యాసంస్థకు రూ.40 వేల చొప్పున రూ. 6,22,030 నిధులను వెచ్చించి పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నారు. గిరిజన పిల్లలు చదువులోనే కాకుండా ఆటపాటల్లో రాణించేలా పిఓ రాహుల్ తనదైన శైలిలో చర్యలు తీసుకున్నారు. విద్యాసంస్థల్లో క్రీడా స్థలాలను గుర్తించి పిల్లలకు క్రీడ తర్ఫీద్ ఇప్పించారు. రూ.25 లక్షలతో క్రీడా పరికరాలు కొనుగోలు చేసి విద్యాసంస్థల్లో అందుబాటులో ఉంచారు. ఉట్నూర్ నందు 2024-25 సంవత్సరంలో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడా పోటీల్లో భద్రాచలం ఐటిడిఏ జోన్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను సాధించటం గమనార్హం. గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్య పై అవగాహన పెంపొందించేందుకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంను ప్రారంభించి అమలు చేశారు. ఈ ప్రోగ్రాం నచ్చిన గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ అన్ని గిరిజన విద్యా సంస్థల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలకు ఉపక్రమించటం పిఓ రాహుల్ సక్సెస్ విద్యాసంస్కరణలకు నిలువుటద్దంగా చెప్పవచ్చు. ఐఐటి, ఎన్ఐటి, ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, లా, పాలిటెక్నిక్ తదితర కోర్సుల్లో సీట్లు సాధించిన గిరిజన పిల్లలకు ఐటీడీఏ తరఫున ఆర్థిక సహకారం, లాప్టాప్ లు అందించి తగు ప్రోత్సాహం ఇవ్వటం జరిగింది. క్రీడల్లో మెరుగైన ప్రతిభ చాటిన వారికి కూడా ఆర్థిక సహకారం చేశారు.

 ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యేక కృషి...

గిరి బిడ్డలకు విద్య అవకాశాలకు పెద్ద పీట వేయటమే కాకుండా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోసం పిఓ రాహుల్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు సంపాదించి జీవనోపాధిపెంపొందించుకోవడానికి గిరిజన యువతకు వివిధ ఉద్యోగ,ఉపాధి కోర్సులలో శిక్షణ అందించి వారికి తోడ్పడుతున్నారు. బి.టి.పి.ఎస్, ఐటిసి, జెన్కో ప్రతినిధులతో మాట్లాడి గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేశారు.
డీఎస్సీ,నీట్,పోలీస్,ఎస్ఐ వివిధ గ్రూప్ పరీక్షలకలో నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ప్రత్యేక నిష్ణాతులచే కోచింగ్ ఇప్పిస్తున్నారు. భద్రాచలం పట్టణంలో గ్రంథాలయానికి 25 లక్షల రూపాయల ఖర్చుతో రీడింగ్ రూమ్ నిర్మాణం చేపట్టారు. నిరుద్యోగులకు గ్రంథాలయం ఎంతగానో సౌకర్యంగా మారింది. గిరిజన యువత శిక్షణ కేంద్రంలో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కోర్సులో 35 మంది యువతకు ఉచిత శిక్షణ అందించి 34 మందికి ప్రైవేట్ కంపెనీలో ఉపాధి కల్పించడం జరిగింది. ఐటీసీ ప్రదం ద్వారా భద్రాచలంలో పిటీషన్ కోర్సులో 87 మందికి, బూర్గంపహాల్లో అసిస్టెంట్ ఎలక్ట్రిషన్ 169 మంది యువతకు ఉచిత శిక్షణ అందించి 194 మందికి ప్రైవేట్ కంపెనీలో ఉపాధి కల్పించడం జరిగింది. స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా 654 మంది యువతకు నాక్ మరియు ఆర్ సి టి ఖమ్మం ద్వారా శిక్షణ ఇప్పించారు.
 
 గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకై..

మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసముంటున్న గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు ఐటీడీఏ పీవో రాహుల్ ప్రత్యేక దృష్టి సారిస్తూ వస్తున్నారు.భద్రాచలం ఏరియా ఆసుపత్రి మొదలుకొని ఏజెన్సీలో ఉన్న పీహెచ్సీలను క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తూ వైద్యులు ఎప్పుడు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య మెరుగుదలకు చర్యలు చేపట్టారు.మందులు, వ్యాక్సిన్లు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా కృషి చేశారు.
పీహెచ్సీ ఆవరణలో గిరిజనులకు ఇబ్బందులు కలగ కుండా సిసి రోడ్లు, ఎమర్జెన్సీ ఇతర విభాగాల్లో ఆధునీకరణ పనులు,కొత్త పీహెచ్సీల నిర్మాణం, సిబ్బందిని సర్దుబాటు చేయడం, మారుమూల ప్రాంత పీహెచ్సీలకు అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటుకు కృషి చేశారు.దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ, ప్రమాద బీమా పథకాలు అందించడానికి కృషి చేశారు. తల్లి ఆరోగ్యం పోషకాహార కార్యక్రమం, గర్భిణీ స్త్రీల నమోదు, ప్రసూతి సేవలు, అసంక్రమణ వ్యాధుల కార్యక్రమం, ఆలన, ఈ సంజీవని, తెలంగాణ డయాగ్నస్టిక్, జాతీయ క్షయ నివారణ, కుష్టు వ్యాధి నిర్మూలన తదితర ప్రభుత్వ కార్యక్రమాలను భద్రాచలం ఐటీడీఏ పరిధిలో విజయవంతంగా నిర్వహించడంలో తనవంతు పాత్ర పోషించారు .

 గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ద్వారా పలు అభివృద్ధి పనులు..

 గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ద్వారా పిఓ పలు అభివృద్ధి పనులను నిర్వహించారు. గ్రామపంచాయతీ భవనముల పథకం కింద ఐటీడీఏ పరిధిలోని 1999 గ్రామపంచాయతీ భవనములు మంజూరు కాగా, రూ. 3980.00 లక్షలతో పనులు చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఇందులో 53 పనులు పూర్తికాగా, మరో 51 పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. మరో 95 పనులు పురోగతిలో ఉన్నవి. గిరిజన భవనముల పథకం కింద 7 గిరిజన భవనములకు రూ. 760.00లక్షలు మంజూరు కాగా వీటిలో ఐదు పనులు పూర్తి కాగా మరో రెండు పనులు పురోగతిలో ఉన్నాయి. గురుకుల పాఠశాల భవనముల పథకముల కింద 12 గురుకుల పాఠశాల భవనములకు రూ. 5520.00 లక్షలు మంజూరైతే ఇందులో ఆరు పనులు పూర్తికాగా మరో ఐదు పనులు పురోగతిలో ఉన్నాయి. మరొకటి ప్రారంభ దశలో ఉంది. ఎస్ టి ఎస్ డి ఎఫ్ పథకం కింద 121 బీటీ రోడ్లు మంజూరు కాగా,రూ. 17849.00 లక్షలతో పనులు చేపట్టి 32 పనులు పూర్తి చేశారు. 56 పనులు పురోగతిలో ఉండగా 33 పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఏ ఏ పీ సి పథకం కింద 20018 ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలకు మరమ్మత్తుల కోసం రూ. 495.70 లక్షలు మంజూరు గాక పనులు చేపట్టే ప్రారంభించడం జరిగింది. ఇందులో 218 పనులు పూర్తి చేశారు 

 గిరిజన మహిళల ఆర్థిక ప్రగతికి చేయూత..

ఎం.ఎస్.ఎం.ఈ యూనిట్ మహిళలు వారి యొక్క యూనిట్లు నడిపించుకోవడానికి రూ. 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారు మార్కెటింగ్ సౌకర్యం చేసుకోవడానికి అవకాశాలను కల్పించారు. దేవస్థానం, గిరిజన మ్యూజియం, ఐటిడిఏ కార్యాలయంలో షాపులు ఏర్పాటు చేయించి జీవనోపాధికి చేయూతనిచ్చారు. ఆర్టీపి పథకం కింద నిరుద్యోగ గిరిజన యువకులకు వాహనాలు అందించారు. మహిళలు పురుషులతో ఏమాత్రం తీసుకోకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా పిఓ రాహుల్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వాటి అమలు దిశగా ప్రయత్నించారు 

 పిసా చట్టం పకడ్బందీగా అమలు చేస్తూ..

గిరిజన గ్రామాలలో లభిస్తున్న సహజ వనరులు గిరిజనులుకే చెందేలా పిసా చట్టం ద్వారా మత్స్య సొసైటీల ఏర్పాటు, ఇసుక ర్యాంపులు మహిళలు నిర్వహించుకునేలా అవకాశాలు కల్పించి గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేశారు. 

 గిరిజన రైతాంగానికి చేదోడు వాదోడుగా..

గిరిజన రైతాంగానికి పివో రాహుల్ ఎనలేని సేవలందించారు.
గిరిజన గ్రామాలలోని రైతులు పోడు భూములలో పంటలు పండించుకునే రైతులకు సేంద్రియ పంటలపై అవగాహన కల్పించి వారికి కరెంటు బోరు, మోటర్లు సబ్సిడీపై అందించడానికి ప్రత్యేక కృషి చేశారు.
గిరిజన గ్రామాలలో విద్యుత్ సౌకర్యం కల్పించడం ద్వారా గిరిజన రైతాంగానికి ఎంతో మేలు చేకూరుతోంది.
దమ్మపేట మండలంలోని కొండరెడ్ల గిరిజన గ్రామాలలో లెవెన్ కె.వి విద్యుత్ లైన్ ఏర్పాటు పొడిగించుటకు దాదాపు 6 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించారు. గిరిజనుల పోడు భూములలో వంద శాతం సబ్సిడీతో వ్యవసాయాన్ని ప్రోత్సహించుటకు ఇందిరా గిరిజన సౌర వికాసం పథకం ద్వారా 2 లక్షల 10 వేల గిరిజన రైతులకు, 6 లక్షల ఎకరాలకు రూ.12,600 కోట్లతో బోరు, సోలార్ మోటర్ నియోజకవర్గాల వారీగా అందించడానికి కృషి చేశారు. 
 
 గిరిజన ప్రగతికి అడుగులు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో కొండ రెడ్లకు 274, ఇతర తెగల గిరిజనులకు 4,750 ఇండ్ల ప్రతిపాదనలకు గ్రామాల వారీగా సర్వే నిర్వహించుటకు కృషి చేశారు. ట్రైబల్ రిలీఫ్ ఫండ్ ద్వారా గిరిజనులకు ఆర్థిక సహాయం అందజేశారు.
ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర వైద్య సేవల కొరకు దారిద్రరేఖకు దిగున ఉన్న గిరిజన కుటుంబాలలో 26 మందికి తక్షణ సహాయం కొరకు రూ.6.20 లక్షలు మంజూరుకు కృషి చేశారు. 
దమ్మపేట మండలం పూసుకుంట, గోగులపూడి కొండ రెడ్ల గిరిజనులకు 12 బోరు బావులు, 11 కేవీ ట్రాన్స్ఫార్మర్లు, 12 లక్షల 14 వేల రూపాయల వ్యయంతో విద్యుత్ సరఫరాకు, గోగులపూడి గ్రామంలో రూ.49 లక్షలతో కొండ రెడ్ల నిరుద్యోగ యువతీ యువకులకు వెదురుతో హస్తకళల శిక్షణ, అగర్బత్తి, సాంబ్రాణి కడ్డీలు తయారీ శిక్షణ, తేనెటీగల పెంపకం,గుబ్బల మంగమ్మ గుడి దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కై జనరేటర్ సౌకర్యం,వెదురు వస్తాద తయారీకి ఆధునిక యంత్రాలు అందించి వారి జీవనోపాధికి కృషి చేశారు. 
 
 భళా ట్రైబల్ మ్యూజియం,,

అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుటకు భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో రూ.50 లక్షల రూపాయలతో మ్యూజియం ఆధునీకరణ పనులు చేపట్టి మ్యూజియంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటంలో సఫలికృతులయ్యారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభించి మ్యూజియం అభివృద్ధికి రూ. 1 కోటి మంజూరుకు కృషి చేశారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియం గిరిజన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు పెద్దపీట వేసింది. కోయ, నాయకపోడు, లంబాడా, కొండ రెడ్లకు చెందిన గిరిజన సంస్కృతి ఇక్కడ పరిరక్షించబడుతోంది. గిరిజన సాంప్రదాయ వెదురు ఇల్లులు, మట్టి ఇల్లులు, మంచె, సెల్ఫ్ పాయింట్లు, పిల్లల బోటింగ్,,బాక్స్ క్రికెట్, పిల్లల ఆట స్థలం, విలువిద్య,ఇసుక వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్ట్, గిరిజన సంస్కృతి చిత్రాలు ఏర్పాటు చేయడంతో అవి యాత్రికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా గిరిజన ఆహార వంటకాలను ఇక్కడ అందుబాటులో ఉంచటంతో యాత్రికులు ఆస్వాదిస్తున్నారు. నిత్యం వేలాదిమంది వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు ట్రైబల్ మ్యూజియం సందర్శిస్తున్నారు. విహార విజ్ఞాన యాత్ర స్థలంగా ఈ మ్యూజియంభాసిల్లుతోంది.గిరిజనుల కోయ భాష అంతరించిపోకుండా నేటితరం గిరిజన యువతి యువకులకు తెలియజేయడానికి ప్రతి ఆహ్వాన పత్రాలు, కోయ భాష తెలుగు లిపితో ముద్రించి వాటి పరిరక్షణకు కృషి చేశారు.భద్రాచలంలో నిర్వహించిన ముక్కోటి, శ్రీరామనవమి వేడుకల విజయవంతానికి తన వంతు కృషి చేశారు.ప్రతి గిరిజన కుటుంబాలతో ఇంటి సభ్యుడిల వారితో కలిసి మెలిసి గిరిజన జాతరలు,భూమి పండుగలు,ఏరువాక పండుగలో పాల్గొంటూ వారి ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ ఐటీడీఏ పీవో రాహుల్ వారిలో ఉత్సాహాన్నినింపుతున్నారు.
మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్గా పని చేసిన కాలంలో పెద్దపల్లి ఎంపీ ఎలక్షన్లో బెల్లంపల్లి కాన్స్టెన్సీ రిటర్నింగ్ అధికారిగా ఉత్తమ సేవలందించినందుకు గాను తెలంగాణ ప్రభుత్వం తరఫున గవర్నర్ చేతులు మీదుగా ఉత్తమ రిటర్నింగ్ అధికారిగా ప్రత్యేక అవార్డు అందుకున్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా.  ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
నేను సైతం.    -మన్నెంలో 'రాహుల్ రేలా'                                             -అడవి బిడ్డలకు కొండంత అండ.                          -గిరిజన ప్రగతికి కీలక అడుగులు.                            -పదునైన ప్రణాళికలతో ఫలితాలు.                          -ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్...
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్
స్ట్రాబెర్రీలు.. చిన్న పండ్లు, గొప్ప లాభాలు!
మహేష్‌ బాబు డెడికేషన్‌ నాకు పాఠం లాంటిది: త్రిష
రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ వివాహం వాయిదా!
ఎమ్మెల్యే నాయిని కి కృతజ్ఞతలు