ఘనంగా జగదీశ్వర్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు
జన్మదిన సందర్భంగా ఎలమంచి ఉదయ్ కిరణ్ టీమ్ ఆధ్వర్యంలో 5కె రన్
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వి.జగదీశ్వర్ గౌడ్ జన్మదినం సందర్భంగా 5 కె రన్ కార్యక్రమంలో పాల్గొన్న మియాపూర్ ప్రధాన కార్యదర్శి యలమంచి ఉదయ్ కిరణ్, టీమ్ సభ్యులు, ఘనమైన స్మరణార్థంగా, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్వి.జగదీశ్వర్ గౌడ్,కొండాపూర్ డివిజన్లోని బోటానికల్ గార్డెన్ వద్ద జరిగిన 5కె స్మారక పరుగులో పాల్గొన్నారు. ఈ పరుగు ఆపరేషన్ సిందూర్లో ప్రాణాలు అర్పించిన జవాన్లకు, పహల్గాం దాడిలో వీరమరణం పొందిన వీరులకు, విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకుఘన నివాళులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ నుండి యలమంచి ఉదయ్ కిరణ్ నాయకత్వంలోవినోద్, నాగ సాయి, ప్రసాద్, సింహాచలం, చిన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.వీరులకు మన స్మరణగా ప్రతి అడుగూ భారత మాతకు అంకితం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.