పంజాబ్ డ్రగ్స్ కేసులో విక్రమ్ సింగ్ మజీతియా అరెస్ట్!
పంజాబ్ రాష్ట్రానికి చెందిన 2021 డ్రగ్స్ కేసులో శిరోమణి అకాలీదళ్ (SAD) సీనియర్ నేత, మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మజీతియా అరెస్ట్ అయ్యారు. బుధవారం తెల్లవారుజామున అమృత్సర్లోని మజీతియా నివాసంపై విజిలెన్స్ బ్యూరో అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సోదాలు చేపట్టడంతో స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది.విక్రమ్ మజీతియా, శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ బావమరిది కాగా, గతంలో పంజాబ్లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భార్య గనీవే కౌర్ మజీతియా పంజాబ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు.2021లో నమోదైన డ్రగ్స్ కేసులో మజీతియా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో సిట్ (SIT) దర్యాప్తు చేపట్టి, మజీతియా కుటుంబానికి చెందిన కంపెనీల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది.ఈ నేపథ్యంలో, బుధవారం తెల్లవారుజామున విజిలెన్స్ అధికారులు మజీతియా ఇంటిని చుట్టుముట్టి తనిఖీలు ప్రారంభించారు. ఈ సమయంలో మజీతియాతో పాటు మరికొందరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.ఈ విషయంపై అమృత్సర్ ఆర్పీఎస్ సంధూ మాట్లాడుతూ, “అరెస్టులు జరిగాయి. వారిను ఇక్కడి నుంచి తరలించాం. ప్రస్తుతం ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి,” అని స్పష్టం చేశారు.కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.