ప్రతి పేద రైతు గౌరవంగా బతకాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
(లోకల్ గైడ్) మహబూబాబాద్ జిల్లా
- కంబాల ముసలయ్య గారు కాంగ్రెస్ పార్టీ బయ్యారం మండల అధ్యక్షులు మాట్లాడుతూరైతన్నలకు రైతు భరోసా నిధులను బయ్యారం మండలంలోని 21 కోట్లు 12346 మంది రైతులకు రైతు భరోసా కింద నిధులు జమాయ్యాయి కావున ఈరోజు బయ్యారం మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి క్షీరాభిషేకం చేసిన బయ్యారం మండల రైతులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సౌభాగ్యం
ప్రతి రైతు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల బాధలు చూసి రైతును రాజును చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ రైతులకు పెట్టుబడి సాయంగా ఒక ఎకరానికి ఏడాదికి 12 వేల,రూపాయల చొప్పున రెండు విడతలుగా అందించడం జరుగుతుందన్నారు రైతులకు 9వ రోజులలో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయడం.రైతులకు భూమిపై పూర్తి హక్కులు పొందాలనే సంకల్పంతో భూభారతి తేవడం జరిగిందన్నారుఅదేవిధంగా ప్రజా ప్రభుత్వంలో చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు రైతులకు ఎకాలంలో 2లక్షాల రుణమాఫీ గృహలక్ష్మి మహాలక్ష్మి,500లకే గ్యాస్ సిలిండర్ ఉచిత కరెంటు 200 యూనిట్లు ప్ర తిక్వింటాకు 500 రూపాయల బోనస్ ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు రాష్ట్రంలో ప్రతి గురుకులాల్లో మేస్ ఛార్జీలు పెంచి నాణ్యమైన భోజనంతోపాటు మౌలిక వసతులు ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచి ప్రతి పేదవారికి ఆరోగ్యం బాగుండాలని ఇందిరమ్మ కన్న కలలు సహకారం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. ఈలాంటి మంచి కార్యక్రమాలు రైతులకు చేస్తుంటే ఓర్వలేని బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వపై అబద్ధ ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతూ ముసలి కన్నీరు కారుస్తున్నవిరిమాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారుఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ బండారి మల్లయ్య సొసైటీ డైరెక్టర్ తిరుమల ప్రభాకర్ రెడ్డి సొసైటీ డైరెక్టర్ కేతమల్లు తగిరా సత్తి రెడ్డి లింగయ్య రసమల నాగేశ్వరరావు భూక్య రవి నాయక్ తమ్మిశెట్టి వెంకటపతి పగడాల శ్రీను కొండపల్లి లక్ష్మీ బోడ రమేష్ నాగరాజు బానోతు నాగరాజు భాస్కర్ తేజావత్ రవీందర్ నాయక్ రాములు తదితరులు పాల్గొన్నారు