టోల్ మినహాయింపు ఇక చరిత్రేనా? – ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ విధించే యోచన

టోల్ మినహాయింపు ఇక చరిత్రేనా? – ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ విధించే యోచన

ఇప్పటివరకు జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు (Two-wheelers) టోల్‌ ఫీజు మినహాయింపు వర్తిస్తుండేది. అయితే, ఈ సౌకర్యం త్వరలో ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. జూలై 15 నుంచి ద్విచక్ర వాహనాలపై కూడా టోల్ వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.ఇప్పటి వరకు ఫోర్ వీలర్లు, ట్రక్కులు, ఇతర పెద్ద వాహనాలకే టోల్ విధించబడుతోంది. దీనివల్ల బైకులు, ఆటో రిక్షాలు టోల్ కట్టకుండానే జాతీయ రహదారులపై ప్రయాణించేవి. అయితే ఈ విధానాన్ని మార్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రస్తుతం ఈ నిర్ణయంపై ఆధికారిక ప్రకటన రాలేదు, కానీ త్వరలోనే కేంద్రం దీనిపై క్లారిటీ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. టోల్ విధింపు అమలైతే, బైక్ వాడుతున్న ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది.ప్రయాణ దూరానికి తగ్గట్టుగా టోల్ వసూలు చేసే విధానాన్ని అధికారులు పరిశీలిస్తున్నారని సమాచారం. కాగా, దీనిపై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది.

Tags:

About The Author

Latest News

బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు
బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్ 
పూరిజగన్నాథున్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 
మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు 
ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు "తమ్ముడు" మూవీకి సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు
అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...