తండేల్ తర్వాత సాయి పల్లవి గ్యాప్ – బాలీవుడ్పై దృష్టి పెట్టిందా?
తండేల్ సినిమా తర్వాత నటి సాయి పల్లవి తెలుగులో ఇప్పటివరకు ఎలాంటి కొత్త ప్రాజెక్ట్కి కమిట్ కాలేదు. దీంతో పలువురు అభిమానుల్లో ఆమె ఇక తెలుగు సినిమాలకు దూరమవుతుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. అయితే ఆమెకు అవకాశాలు రాకపోవడం వల్ల కాదు, ఆమె పాత్రల విషయంలో చేసే సెలెక్టివ్ ఎంపికల వల్లే ఈ గ్యాప్ అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.సాయి పల్లవికి తన పాత్రపై నమ్మకం కలిగితేనే ఒప్పుకుంటుంది. అందుకే స్టార్ డైరెక్టర్లు ఆమె డేట్ల కోసం ఎదురుచూస్తున్నా, పాత్రకు సరైన న్యాయం చేయగల కథ లేకపోతే ఆమె ముందుకురారు. అటు నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడతారని ఎప్పుడో చెప్పేశారు. కానీ ఆమెకు భిన్నంగా కనిపించే పాత్రను సిద్ధం చేయడం ఏ డైరెక్టర్కైనా కత్తి మీద సామే.ఇప్పుడైతే బాలీవుడ్ ప్రాజెక్టులపై ఆమె దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమాలో మొదటి భాగం షూటింగ్ పూర్తవగా, ప్రస్తుతం రెండో భాగం జరుపుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ఆమె రెగ్యులర్ డేట్లతో పాటు కొన్ని అదనపు రోజులు కేటాయించిందని సమాచారం.అలాగే ‘ఏక్ దిన్’ అనే మరో హిందీ చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. మరియు రెండు ఇతర బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుపుతోందన్న టాక్ వినిపిస్తోంది. అందులో ఒకటి యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఉండొచ్చని బీ టౌన్లో జోరుగా చర్చ.ఇదే తరహాలో తెలుగమ్మాయి శ్రీలీల కూడా బాలీవుడ్కు అడుగు పెట్టిందా? అనే ప్రశ్న ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు వార్తలు వెలుగుచూశాయి. ప్రస్తుతం ఆమె హిందీ, తమిళ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్న ప్రచారం కూడా సాగుతోంది.ఇక ఈ ప్రచారాలకు బ్రేక్ పడాలంటే, సాయి పల్లవి లాగే శ్రీలీల కూడా తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్ట్కి కమిట్ అవ్వాల్సిందే. లేదంటే ఈ "బాలీవుడ్ మోజు" అనుమానాలు కొనసాగుతూనే ఉంటాయి.