స్రిజితా ఘోష్
కృష్ణ గోదావరి నది జలాల లో న్యాయం జరిగే అంత వరకు పోరాటం.
ఇరిగేషన్ శాఖ పై
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సంవత్సరానికి 16000 కోట్ల మిత్తి కడుతున్నాం.
రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది.
ఎత్తి పోతల పథకాల పనులు వేగవంతంగా, నాణ్యతగా జరగాలి.
జానపాడు, బెట్టే తండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తి అయితే పాలకీడు మండలం సస్యశ్యామలం అవుతు సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది.
రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి
నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి ప్రతినిధి . లోకల్ గైడ్.
కృష్ణ, గోదావరి జలాల పంపకంలో గత పాలకుల అశ్రద్ధ వల్ల తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిందని దానిని సరి చేసేందుకు మేము పోరాడుతున్నామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం పాలకీడు మండలం పాలకీడు మండలం జానపాడు గ్రామంలో కృష్ణ నది పై నిర్మిస్తున్న జవహర్ జానపాడు లిప్ట్ ఇరిగేషన్,బెట్టేతండా గ్రామంలో మూసీనది పైన నిర్మిస్తున్న బెట్టేతండ స్కీం పనులను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి రాష్ట్ర నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకులు పదేళ్ల నిర్లక్ష్యం చేయటంతో కృష్ణ నదిలో 811 టి యమ్ సి లలో ఆంధ్ర కి 599 టి యమ్ సి లు, తెలంగాణాకి 299 టి యమ్ సి లకి వ్రాత పూర్వకంగా ఒప్పుకున్నారని కానీ మేము వచ్చాక నది పరివాహక ప్రాంతం,ఆయకట్టు, జనాభా ను పరిగణనలోకి తీసుకొని నీటి కేటాయింపులు చేయాలనీ పోరాడుతున్నామని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడి హట్టి వద్ద 38000 కోట్లతో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తే కమిషనలకి కక్కుర్తి పడి లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం పేరుతో నిర్మిస్తే మూడేళ్ళకే కూలిపోయిందని అదే తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తే 62000 కోట్ల రూపాయలు మిగిలేవి అని వాటితో ఎస్ ఎల్ బి సి, డిండి, పాలమూరు రంగారెడ్డి, భీమా, నెత్తంపాడు, కోయిల సాగర్, దేవాదుల, సీత రామ సాగర్, గౌరేళ్లి, లాంటి ప్రాజెక్టు లు పూర్తి అయి నేడు తెలంగాణ సస్యాశ్యామలం అయ్యేదన్ని కానీ ఇరిగేషన్ శాఖపై వారు చేసిన తప్పిదాల వల్ల నేడు మేము 16000 కోట్ల రూపాయలు వడ్డీ చెలిస్తున్నామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి 27,500 కోట్లు, సీతారామ ప్రాజెక్ట్ 10,000 కోట్లు ఖర్చు చేసిన ఒక ఎకరం కొత్త ఆయకట్టు లోకి తీసుకొని రాలేదని అన్నారు.మేము ప్రభుత్వం ఏర్పాటు చేసాక ముఖ్యమంత్రి, నేను నీటిపారుదల శాఖ లో జరిగిన తప్పిదాలను ఒక్కొకటి సరి చేసుకుంటూ కాళేశ్వరం నీరు ఇవ్వకున్నా తెలంగాణ లో ఖరీఫ్, రభీ సీజన్ లలో కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పడించి దేశం లోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని అలాగే ముందస్తుగా రైతు లకి పెట్టుబడి కొరకు 9 రోజులలో 9000 కోట్లు రైతు భరోసా కింద వేయటం జరిగిందని తెలిపారు.జవహర్ జానపాడు లిప్ట్ ఇరిగేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా, నాణ్యత పాటిస్తూ పూర్తి చేయాలని మంత్రి కాంట్రాక్టర్ ని ఆదేశించారు. పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని ఇప్పటికే మూడు సార్లు సందర్శించిన పనులలో పురోగతి లేదని కాంట్రాక్టర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు జానపాడు లిప్ట్ ఇరిగేషన్ స్కీం ను 302 కోట్ల రూపాయలతో నిర్మించటం జరుగుతుందని దీని ద్వారా అలింగాపురం,రాఘవపురం, బొత్తలపాలెం, కోమటికుంట,మీగడం పాడు తండా, చెరువు తండా, హనుమాయగూడెం,పాలకీడు, సజ్జాపురం, నాగిరెడ్డి గూడెం గ్రామాలలోని 10,000 ఎకరాలకి సాగునీరు అలాగే జానపాడు చెరువు కి నీరు అందించటం జరుగుతుందని తెలిపారు.డిజైన్ లో ఏమైనా మార్పులు ఉంటే సి డి ఓ(సర్కులర్ డిజైన్ ఆపరేషన్) సి ఈ ద్వారా చేసుకోవాలని కాంట్రాక్టర్ కి సూచించారు.లిప్ట్ ఇరిగేషన్ పనులు పైప్ లైన్ పనులు ఒకే సారి నిర్మించి త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులో కి తీసుకొనిరావాలని సూచించారు.
తదుపరి 33.83 కోట్లతో నిర్మించే బెట్టే తండా లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు పరిశీలించారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా బెట్టేతండా, సజ్జాపురం, పాడియా తండా ల గిరిజన రైతులకి చెందిన 2041 ఎకరాలు ఆయకట్టు సాగులోకి రావటం జరుగుతుందని తెలిపారు. అలాగే మూసి నదిలో నీరు ఉండేలా 10.50కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ నిర్మిస్తున్నామని తెలిపారు. పనులు వేగవంతంగా, నాణ్యత పాటిస్తూ పూర్తి చేసి సెప్టెంబర్ నాటికి నీరు అందించాలని కాంట్రాక్టర్ కి, అధికారులకి మంత్రి ఆదేశించారు.జానపాడు, బెట్టే తండా లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తి అయితే పాలకీడు మండలం సస్యశ్యామలం, సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎస్పి నరసింహ, సి డి ఓ సి ఈ ,ఆర్డివో శ్రీనివాసులు,ఇరిగేషన్ సి ఈ రమేష్ బాబు, ఎస్ ఈ శివ ధర్మ తేజ, డి ఈ నవికాంత్, హరి కిషోర్,ఏఈ సతీష్ కాంట్రాక్టర్ శ్రీనివాస్,హన్మంత్ రామ్, నాగరాజు,అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.