గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్కు సీఎం చంద్రబాబు ప్రారంభం
By Ram Reddy
On
లోకల్ గైడ్ ,గుంటూరు: గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలీసు ఏఐ హ్యాకథాన్ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పోలీసు శాఖలో కృత్రిమ మేధ (AI) వినియోగంపై మూడు రోజుల పాటు ఈ హ్యాకథాన్ కొనసాగనుంది.తొలుత అమరావతి నుంచి హెలికాప్టర్లో గుంటూరు చేరుకున్న చంద్రబాబుకు, కొత్తపాలెంలోని జిందాల్ ఫ్యాక్టరీ వద్ద జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, హోం మంత్రి వంగలపూడి అనీ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
27 Jun 2025 18:30:26
బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్