పుట్టిన రోజు నాడే గుండెపోటుతో వైద్య విద్యార్థి మృతి....

 గ్రామంలో అలుముకున్న విషాధ ఛాయలు...
Published On
పుట్టిన రోజు నాడే గుండెపోటుతో వైద్య విద్యార్థి మృతి....

 ఫిలిప్పీన్స్ లో  చోటుచేసుకున్న విషాద ఘటన..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్)

ఫిలిప్పీన్స్ లో డోంగ్లీ మండలంలోని కుర్లా గ్రామానికి చెందిన వైద్య విద్యార్ధి అయిన వడ్ల యోగి అనే వైద్య విద్యార్థి పుట్టినరోజున గుండెపోటుతో మృతిచెందాడు. పుట్టినరోజు నాడే మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి...పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. డోంగ్లీ మండలం కుర్ల గ్రామానికి చెందిన యోగి మూడేళ్ల క్రితం ఎంబీబీఎస్ కోసం ఫిలిప్పీన్స్ వెళ్లాడు. కళాశాలకు సెలవులు ఇవ్వడంతో 3 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి 15 రోజుల క్రితం తిరిగి ఫిలిప్పీన్స్ అక్కడికి చేరుకున్నాడు. బుధవారం యోగి పుట్టినరోజు కావడంతో ఉదయం 8 గంటలకు అతడి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఛాతీలో నొప్పి వస్తుందని యోగి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పగా.. ఆస్పత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. స్నేహితుల సహాయంతో ఆస్పత్రికి వెళ్తుండగా మెట్లు దిగే క్రమంలో యోగి కుప్పకూలిపోయాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధరించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు అతడి స్నేహితులు తెలిపారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి
లోకల్ గైడ్ బెజ్జంకి జూన్ 22: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజా సమస్యలను పక్కనపెట్టి తన అనుచరుల పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని సీపీఐ జిల్లా నాయకుడు...
నువా డైమండ్ ఆభరణాల కలెక్షన్ను ఆవిష్కరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కోకాపేటలో
నీట్ రీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు....
ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం కోసం అంగన్వాడీల కృషి అభినందనీయం -గుడిమల్కాపూర్ డైరెక్టర్ బండారి శంకర్
రవీంద్రభారతిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వి హెచ్ హనుమంతరావుకు ఘన సన్మానం 
8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ:
వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పని చేయాలి ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్