కెన‌డా చేరుకున్న ప్ర‌ధాని మోదీ.....

కెన‌డా చేరుకున్న ప్ర‌ధాని మోదీ.....

లోక‌ల్ గైడ్ : 
మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కెనడా కు చేరుకున్నారు. అక్కడ నిర్వహించనున్న జీ7 సదస్సులో పాల్గొనడానికి కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు మోదీ వెళ్లారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మోదీ కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ ఆయనకు ఘన స్వాగతం లభించింది. 2015 తర్వాత మోదీ కెనడాకు వెళ్లడం ఇదే తొలిసారి.కెనడాలోని కననాస్కిస్‌ వేదికగా జరిగే రెండు రోజుల జీ7 సదస్సుల్లో మోదీ పాల్గొననున్నారు. జీ7 సదస్సులో మోదీ పాల్గొనడం ఇది వరుసగా ఆరోసారి కావడం విశేషం. ఈ సందర్భంగా జీ7 దేశాధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రధానులతో మోదీ ఇంధన భద్రత, ముఖ్య అంతర్జాతీయ అంశాలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ప్రత్యేకంగా ఏఐ (AI) మరియు క్వాంటమ్‌ టెక్నాలజీ అంశాలపై చర్చించనున్నారు.తిరుగు ప్రయాణంలో భాగంగా జూన్ 18న మోదీ ఐరోపా దేశమైన క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధానమంత్రి పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Tags:

About The Author

Advertisement

Latest News

*ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.. *ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు...
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యేను ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ...
ఈనాటి బాలలే రేపటి పౌరులు
అలరించిన చిరుతల   రామాయణం
పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్న టీఎస్ ఆర్టిసి
సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన
కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్  సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ