వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో స్మృతి మంధాన అగ్రస్థానం
By Ram Reddy
On
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో మళ్లీ నంబర్వన్ స్థానాన్ని చేజిక్కించుకుంది. తాజాగా విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో ఆమె అగ్రస్ధానంలో నిలిచింది. 2019 తర్వాత మరోసారి భారత వైస్ కెప్టెన్గా ఉన్న స్మృతి మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం. ఇటీవల దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వోల్వార్డ్ 19 పాయింట్లు కోల్పోవడంతో స్మృతి ముందుకు దూసుకెళ్లింది. స్మృతి 727 రేటింగ్ పాయింట్లతో టాప్లో ఉంటే, ఇంగ్లండ్ కెప్టెన్ నటాలీ స్కీవర్-బ్రంట్ 719 పాయింట్లతో రెండో స్థానంలో, వోల్వార్డ్ కూడా అదే పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మంధాన తర్వాత భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ వరుసగా 14వ, 15వ ర్యాంకుల్లో ఉన్నారు.
Tags:
About The Author
Latest News
17 Jun 2025 17:55:40
మంచిర్యాల (లోకల్ గైడ్): బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సభని రాజేంద్రప్రసాద్ సహాయ కార్యదర్శి పసులేటి...