పాయాను త‌ర‌చూ తింటే క‌లిగే లాభాలు .......

పాయాను త‌ర‌చూ తింటే క‌లిగే లాభాలు .......

చల్లటి వాతావరణంలో వేడి వేడి పాయా తినడంలో వచ్చే ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది కదా! పాయాను చాలామంది రోటీలతో తింటారు, కొందరు బ్రెడ్‌తో, మరికొందరు అన్నంతో కూడా రుచిచూస్తారు. ఏ విధంగా తిన్నా పాయా శరీరానికి పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

శక్తి కోసం:
పాయా సూప్‌ తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే శక్తిని అందించే కొల్లాజెన్ పుష్కలంగా లభిస్తుంది. వండిన తర్వాత ఇది జెలాటిన్‌గా మారి శరీరానికి అవసరమైన అమినో ఆమ్లాలను అందిస్తుంది. ఇవి కండరాల నిర్మాణానికి తోడ్పడి శక్తి, ఉత్సాహాన్ని పెంచుతాయి.

ఎముకలకు బలం:
పాయాలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, జింక్‌, సెలీనియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ A, K, B సమూహ విటమిన్లు, విటమిన్ E కూడా ఉంటాయి. వీటి వల్ల శరీరంలోని జీవక్రియలు సరిగా జరుగుతాయి. ఎముకలు బలంగా ఉండి విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గి, ఆర్థరైటిస్ సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. కీళ్ల గుజ్జు పునరుద్ధరించబడుతూ కీళ్ల పనితీరు మెరుగుపడుతుంది.

జీర్ణ వ్యవస్థకు మేలు:
పాయాలో ఉండే జెలాటిన్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్ల్యూటమైన్, గ్లైసిన్ వంటి అమినో ఆమ్లాలు ఉత్పత్తి అవి జీర్ణాశయ గోడలను రక్షిస్తాయి. కాబట్టి అల్సర్, ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వంటి సమస్యలు తగ్గుతాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణమై జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. అలాగే ఇందులో ఉన్న జింక్‌, ఐరన్‌, సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనగల శక్తిని ఇస్తాయి.

చర్మం, మానసిక ఆరోగ్యం:
పాయాలో ఉండే కొల్లాజెన్, జెలాటిన్ చర్మాన్ని బిగువుగా ఉంచి ముడతలు రాకుండా చేస్తాయి. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తారు. పాయా కండరాలను బలపరుస్తూ ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. మైండ్ రిలాక్స్ అయి మంచి నిద్ర పడుతుంది. డిప్రెషన్ సమస్యలు కూడా తగ్గుతాయి.

ఎవరికి వద్దు:
ఇన్ని లాభాలు ఉన్నా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు పాయా తినరాదు. కిడ్నీ వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, గౌట్ సమస్య, శరీరంలో సోడియం స్థాయిలు అధికంగా ఉన్నవారు పాయా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి.. పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి..
మంచిర్యాల (లోకల్ గైడ్): బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సభని రాజేంద్రప్రసాద్ సహాయ కార్యదర్శి పసులేటి...
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి రెవెన్యూ సదస్సులు
తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో స్మృతి మంధాన అగ్రస్థానం
పాయాను త‌ర‌చూ తింటే క‌లిగే లాభాలు .......
ఇంటర్నేషనల్ యోగ డే 2025 జూన్, 21 న పతంజలి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం
సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలి