వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్ (FASTag) వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కొత్త ఫాస్టాగ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇకపై ప్రతిసారి టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఏడాది మొత్తం ప్రయాణానికి ఒక్కసారిగా చెల్లించే విధంగా ఫాస్టాగ్ వార్షిక పాస్ (FASTag Annual Pass) ను అందుబాటులోకి తీసుకువస్తోంది.ఈ పాస్ ద్వారా వాహనదారులు రూ. 3,000 చెల్లించి ఏడాది పొడవునా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై ఆందోళన లేకుండా ప్రయాణించవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎక్స్లో (X) ద్వారా పంచుకున్నారు.స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్ట్ 15 నుంచి ఈ పాస్ అందుబాటులోకి రానుంది. యాక్టివేట్ చేసిన పాస్లు ఏడాది రోజుల పాటు లేదా 200 ట్రిప్పులు (ఏది ముందే పూర్తవుతుందో అది) వరకు చెల్లుబాటు అవుతాయని గడ్కరీ తెలిపారు. కార్లు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది.వాహనదారులు ఈ పాస్ను యాక్టివేట్ చేసుకోవడానికి అవసరమైన లింక్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి చెప్పారు. రాజ్మార్గ్ యాప్, NHAI మరియు MoRTH వెబ్సైట్లు ద్వారా ఈ లింక్ ను పొందుపరుస్తామని తెలిపారు.