పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్న టీఎస్ ఆర్టిసి

పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్న టీఎస్ ఆర్టిసి

బస్సు పాస్ చార్జీల పెంపు వల్ల  ఆందోళన చెందుతున్న పేద విద్యార్థులు 

 ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ చౌహన్ 

 జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ 

లోకల్ గైడ్ -షాద్నగర్ 

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ విద్యార్థుల బస్ పాస్ చార్జీలపై 20 శాతం పెంపు వలన పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని వెంటనే పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ చవాన్, సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్  ప్రభుత్వంని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా జిల్లా అధ్యక్షులు పవన్ చౌహన్, ఆకాష్ నాయక్  మాట్లాడుతూగ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువు నిమిత్తం ఆర్టీసీ బస్సుల ద్వారా పట్టణాలకు వెళ్లి చదువుని కొనసాగిస్తున్న పరిస్థితి ఉందని, ఇప్పటికే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోడానికి సౌకర్యాలు లేకపోయినా ప్రభుత్వ కళాశాలలు చదువుతూ తమ చదువును కొనసాగిస్తున్నటువంటి తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా బస్ చార్జీలు పెంపుతో పేద విద్యార్థుల పై మరింత భారం పడుతుందన్నారు. పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల బస్ పాస్ చార్జీలు 20 శాతానికి పైగా పెంచుతున్నామని ఆర్టీసీ సంస్థ ప్రకటించినదని విద్యార్థులు బస్సు పాస్ ధర 20% పెంపును అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్  వ్యతిరేకిస్తుందన్నారు ప్రస్తుతం పెరిగిన ఖర్చులు కారణంగా విద్యార్థులు బస్సు పాసు ధరలు పెంచినట్లు అధికారులు వెల్లడించడం తగదన్నారు. పెంచిన ధరలతో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ,బస్ పాస్ ధరలు పెంచడం ఎంతవరకు సబబు అని అన్నారు. విద్యార్థుల పెంచిన బస్సు పాస్ ధరలను తగ్గించి విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రంగారెడ్డి జిల్లా   జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నామన్నారు.బస్ పాస్ పెంపు తో విద్యార్థులు  తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కానున్నదని రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 11 లక్షల వరకు బస్సు పాసులు ఉన్నాయని విద్యార్థుల పైన అధిక భారం మోపకుండా ప్రభుత్వం తగిన చర్యలు  తీసుకొని విద్యార్థుల పెంచిన బస్ పాసులు ధరలు తగ్గించాలని లేనియెడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో షాద్నగర్ నాయకులు ఆకాష్,రాహుల్, శ్రీను, తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

*ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.. *ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు...
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యేను ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ...
ఈనాటి బాలలే రేపటి పౌరులు
అలరించిన చిరుతల   రామాయణం
పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్న టీఎస్ ఆర్టిసి
సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన
కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్  సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ