జిల్లాలో పండగల సాగుతున్న వ్యవసాయము,
సాగుకు సమాయత్తం అవుతున్న అన్నదాతలు,
ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా నిధులతో ఆనందం,
గతం కంటే గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణత,
అవధులు లేని ఆనందంలో అన్నదాత,
జిల్లాలో నేటి వరకు 2,14,347 మంది రైతులకు 243,55,41,698/- రూపాయలను పెట్టుబడి సాయం,
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,
రైతులు వానకాలం సాగుపై నాగర్ కర్నూలు జిల్లాలో పండుగాలా వ్యవసాయ పనులు చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకొని జిల్లాలో గణనీయంగా పంట విస్తీర్ణత పెరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయానికి అవసరమైనా విత్తనాలు క్రిమిసంహారక మందులను జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు ఈ సంవత్సరం వర్షాలు కూడా ముందుగా రావడంతో జిల్లాలో అన్నదాతలు సంతోషదాయకంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. రైతు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యత మరోసారి రైతు భరోసా నిధుల విడుదలతో వెల్లడైంది, వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేలా ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వాన కాలంలో 4 లక్షల 80 వేల ఎకరాల్లో వివిధరకాల పంటలు సాగు చెయ్యగా ప్రస్తుత వానాకాలంలో 5 లక్షల 92 వేల ఎకరాల భూముల్లో వివిధ రకాల పంటల సాగుకు రైతాంగం సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఈ నిధుల ద్వారా విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు అవసరాలకు సంబంధించి రైతులకు మద్దతు లభించనుండటంతో, చాలా మంది రైతులు ముందుగానే అవసరమైన వ్యవసాయ సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విధంగా విత్తనాల సేకరణకు ముందు రైతులకు రైతు భరోసా నిధులు అందడం ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, అందుకు అనుగుణంగానే జిల్లా యంత్రాంగం రైతులకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించేందుకు సంసిద్ధంగా కృషి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో 2025-26 వానాకాలం సీజన్ కు గాను గురువారం సాయంత్రం వరకు రైతు భరోసా క్రింద ఎకరానికి 6000/-చొప్పున 2,47,112 మంది రైతులకు 243,55,41,698/- రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. జిల్లాలో మిగిలిన రైతులకు మరో వారము రోజులలో విడతల వారిగా ఖాతాలలో డబ్బులు జమ చేయటం జరుగుతుందని, ఇంకా బ్యాంకు అకౌంటు ఎటువంటి తప్పులు వున్నా లేదా కొత్తగా పాస్ బుక్ జారి అయినను అవసరమైన పత్రాలను సంబందిత వ్యవసాయ విస్తరణ అధికారులను మండల వ్యవసాయ అధికారులకు 20వ తేదీ లోపుగా సంప్రదించాలని కోరారు. రైతులు ఎటువంటి అపోహలకు తావివ్వకుండా రైతు భరోసా నిధులు జమ చేసే వరకు వేచి వుండాలని కోరారు.
రైతు భరోసా నిధుల విడుదల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కృతజ్ఞతలు తెలిపారు. సాగులో జాప్యం కాకుండా సకాలంలో సహాయం అందించడం అభినందనీయమని రైతులు పేర్కొన్నారు.రైతు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగిస్తున్న చర్యలు భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, లాభదాయకంగా మార్చనున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.