విద్యా హబ్ గా నాగర్కర్నూల్ ను తిర్చిదిద్దుతా:
ఎమ్మెల్యే Dr కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
నాగర్కర్నూల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే Dr .కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలో 1967లో స్థాపించబడిన జూనియర్ కళాశాల భవనం నేడు శిథిలావస్థకు చేరుకోవడంతో తాను ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దిరోజుల్లోనే కళాశాల భవనాన్ని నూతన భవనంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నట్లు దాని ప్రతిరూపమే నేడు సీఎంతో 9 కోట్ల నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు గత ప్రభుత్వాలు ఓట్ల రాజకీయమే తప్ప విద్యార్థుల భవిష్యత్తును ఆలోచన చేయలేదని ఆయన అన్నారు ఈ కళాశాల ఎంతోమందిని ఎన్నో ఉన్నత పదవులు అనుభవించేలా తీర్చిదిద్దిన ఎవరు పట్టించుకోకపోవడం తనను బాధకు గురి చేసిందని అన్నారు రాబోయే రోజుల్లో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రాన్ని విద్యాహబుగా మార్చడానికి తను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు కళాశాల ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే పూర్వపు రోజులు గుర్తుకొచ్చాయని అన్నారు తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఐదు సార్లు కళాశాల విజిట్ చేయడం జరిగిందన్నారు అలాగే మిగతా కళాశాలలో కూడా వసతులు కల్పించి విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్ళ కుండా ఇక్కడ నే చదువువుకునే విదంగా చర్యలు చేపడుతామని అన్నారు అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు కళాశాల ప్రిన్సిపల్ మాధవి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలుపుతున్నాన్నారు. కళాశాలకు నిధుల మంజురుతో పాటుగా వర్క్ ఆర్డర్ కూడా రిలీజ్ అయ్యిందన్నారు. కళాశాల డిజైన్ అన్ని రకాల సౌకర్యాలతో ఉండేలా ప్రణాళిక చేపడతమన్నారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా కళాశాల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అన్నారు.
నాగర్కర్నూల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయ్యిందని, ఏ చదువైనా నాగర్కర్నూల్ లో చదివేలా విద్యా కేంద్రాలను ఏర్పాటు చేపడతామన్నారు. అనంతరం లెక్చరర్లు, విద్యార్థులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ, లెక్చరర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.