పటాన్‌చెరు రైతులకు రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయండి 

మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేసిన కాట శ్రీనివాస్ గౌడ్ 

పటాన్‌చెరు రైతులకు రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయండి 

ప్రతి రైతుకు రైతు భరోసా అందించే వరకు అండగా ఉంటాం..

లోకల్ గైడ్ పటాన్చెరు:వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా  నిధులు పటాన్‌చెరు  నియోజకవర్గంలోని రైతులకు జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. తక్షణమే నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్  కలిసి వినతి పత్రం అందచేశారు మూడు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ప్రకటించిన నేపథ్యంలో.. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 27,120 మంది రైతులకు నిధులు జమ  కాలేదన్న విషయం తెలియడంతో.. గురువారం ఉదయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని కలిసి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేశారు.. రైతు భరోసా నిధులు జమ కాకపోవడంతో వ్యవసాయ పనులు ప్రారంభించడం కష్టతరంగా మారిందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాలు ఉండగా.. కేవలం గుమ్మడిదల మండల రైతులకు మాత్రమే నిధులు జమ అయ్యాయని తెలిపారు. మిగిలిన రామచంద్రపురం, అమీన్పూర్, పటాన్చెరు, జిన్నారం మండలాల పరిధిలోని 27,120 మంది రైతులు 43,302 ఎకరాల్లో వ్యవసాయం సాగు చేస్తున్నారని.. వీరందరికీ తొలి విడత రైతు భరోసా ద్వారా 12 కోట్ల 99 లక్షల రూపాయలు నిధులు విడుదల కావలసి ఉందని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి తుమ్మల.. అతి త్వరలో రైతులందరికీ రైతు భరోసా నిధులు అందజేస్తామని హామీ ఇచ్చారని కాట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు..ఈ అంశంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా అందించే వరకు తాను అండగా ఉంటానని పటాన్చెరు రైతాంగానికి కాట శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.

Tags:

About The Author

Advertisement

Latest News