ఎల్బీ స్టేడీయంలో ఘ‌నంగా యోగా దినోత్సవం

ఎల్బీ స్టేడీయంలో ఘ‌నంగా యోగా దినోత్సవం

జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో వేడుకలను ఘ‌నంగ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఎల్బీ స్టేడియంలో యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.జూన్ 20న ఎల్బీ స్టేడియంలో 24 గంటల ముందే కౌంట్ డౌన్ మహోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రముఖ యోగా సంస్థలు, విద్యా సంస్థలు, సామాజిక సంస్థలు చురుకుగా పాల్గొంటాయని చెప్పారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, అలాగే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు.యోగా ఆర్గనైజేషన్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రముఖ నటులు ఖుష్బూ, మీనాక్షి చౌదరి, సాయి దుర్గా తేజ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు.

Tags:

About The Author

Advertisement

Latest News

సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా... సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
  ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది... జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి... నిజామాబాద్,(లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...
రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం 
సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ...