కిడ్నాప్ చేసి  దొంగతనానికి  పాల్పడిన నిందితులు అరెస్ట్. 

కిడ్నాప్ చేసి  దొంగతనానికి  పాల్పడిన నిందితులు అరెస్ట్. 

మూడు రోజులలో కిడ్నాప్, దొంగతనాన్ని ఛేదించిన నిర్మల్ పోలీసులు.అభినందించిన జిల్లా ఎస్పీ. 

నిర్మల్, లోకల్ గైడ్ : 

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నాప్, దొంగతనాన్ని ఛేదించిన నిందితులను నిర్మల్ పోలీసులు.శుక్రవారం అరెస్ట్ చేశారు.నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల తెలిపిన వివరాల ఈలా ఉన్నాయి.
నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పరిధిలో పొనకల్ గ్రామంలో చోటు చేసుకున్న కిడ్నాప్, హత్యాయత్నం, దొంగతనం కేసును నిర్మల్ పోలీసులు వేగంగా ఛేదించారు. బాధితుడు చిక్యాల హరీష్ కుమార్  రావు, Ex DCCB ఛైర్మన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, హత్యాయత్నం కు ప్రయత్నించి, బెదిరించి నగదు డిమాండ్ చేయడమే కాకుండా ఇంటిలోకి చొరబడి బంగారం, నగదును వాహనమును దొంగలించిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది. 

కేసు నేపథ్యం:

         ప్రధాన నిందితుడు షేక్ హైదర్ (వయసు 39, వృత్తి డ్రైవర్, నివాసం: పోనకల్ గ్రామం) గతంలో ఇతను బాధితుడైన చిక్యాల హరీష్ రావు వద్ద డ్రైవర్‌ గా పనిచేసేవాడు, ఇతని ప్రవర్తన నచ్చక 6 నెలలకే పనిలోనుండి తీసివేయడంతో షేక్ హైదర్ పగ పెంచుకున్నాడు. అతను తన మిత్రుడు బానాల ప్రిన్స్ తో కలిసి ఈ కుట్రను పన్నాడు. వారి ప్రణాళిక మేరకు గుంటూరు కు చెందిన బానాల ప్రిన్స్ విజయవాడకు చెందిన తట్టురి రవి  కళకంటి సురేష్ , గూడె కోటేశ్వర రావు లు,పోనకల్ కు చెందిన మధుసూదన్  నిందితులుగా ఉన్నారు. కిడ్నాప్‌కు అవసరమైన కత్తులు, తాళ్లు, మాస్కులు, ప్లాస్టర్లు ముందుగానే సిద్ధం చేసుకున్నారు.


కిడ్నాప్ ఘటన వివరాలు:

        కిడ్నాప్ కు  ముందు నిందితులకు మధుసూదన్(పొనకల్) అనే వ్యక్తి హరీష్ రావు రాకపోకల వివరాలు తెలియజేస్తూ సహకరించాడు. దీని కోసం రెండు సార్లు ఎక్కి నిర్వహించారు. కిడ్నాప్ కోసం నిందితులు పటాన్ చెరువులో లాంగ్ డ్రైవ్ కోసం అని ఒక షిఫ్ట్ కార్ అద్దెకు తీసుకున్నారు. దానిలో అందరూ పొనకల్ కి చేరుకున్నారు. తేది: 15.06.2025 అర్ధరాత్రి సుమారుగా 1:45 గంటలకు, నిందితులు పోనకల్ గ్రామంలోని బాధితుడి ఇంటి పైకప్పు ద్వారా లోపల ప్రవేశించి, అతని చేతులు కాళ్ళు కట్టి, నోరుమూసి బెదిరించారు. బంగారు చైన్, రెండు బంగారు బిళ్ళలు, డైమండ్ ఉంగరం,రూ. 5,000/- నగదును దొంగలించారు. అనంతరం బాధితుడిని అతని కారు ఇన్నోవా లో కిడ్నాప్ చేసి హైదరాబాద్ వైపు తరలించారు.

కిడ్నాప్ తరువాత మార్గంలో జరిగిన ఘటనలు:

బాధితుడిని రెండు కార్లలో (TS 01EF 0666 బాధితుని కారు,TS 15FK 6442) హైదరాబాద్ వైపునకు తరలించడంలో నిందితులు జాగ్రత్తగా ప్రణాళిక అమలు చేశారు.

కారులో నిందితులు బాధితుడిని కత్తులతో బెదిరిస్తూ, అతని బంధువులకు ఫోన్లు చేయించి రూ. 3 కోట్లు డిమాండ్ చేశారు.

బాధితుడు హైదరాబాద్ లో ఉన్న బంధువులకు ఫోన్ చేసి డబ్బులు ఇచ్చేలా ఒత్తిడి ఎదుర్కొన్నాడు.నిర్మల్ జిల్లా పరిధిలో నిందితుడు హైదర్ బిజెపి మైనారిటీ మోర్చా కన్వీనర్ గా పనిచేయడం వల్ల అతనిని  గుర్తిస్తారని ముందుగానే గుర్తించి టోల్ ప్లాజాలు తప్పించే మార్గాల్లో ప్రయాణించారు.

మనోహరాబాద్ టోల్ ప్లాజా వద్ద కార్ ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ కాకపోవడంతో కారును ఆపాల్సి వచ్చింది. అదే సమయంలో బాధితుడు కట్లు విడిపించుకొని నిందితులను తోసి కారులో నుంచి బయటికి దూకి పరారయ్యాడు.

దొరికిపోతామన్న భయంతో నిందితులు బాధితుని కారును టోల్ ప్లాజా కు కొద్ది దూరం లో వదిలేసి, వారు కిరాయికి తెచ్చుకున్న మరొక కారులో దోచుకున్న సొత్తు తో పరారయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, స్పందించి కేసును ఛేదించడం కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరచారు ,ఏఎస్పి నిర్మల్ రాజేష్ మీన నేతృత్వం లో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞాన సహాయం తో చాక చక్యంగా నాలుగు రోజుల్లోనే నిందుతులని పట్టు కున్నారు.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు: 

కిడ్నాప్‌కు వాడిన కార్ (TS 15FK 6442)
బంగారు చైన్
బాధితుడి పర్సు
నగదు రూ. 2,000/-
6 సెల్ ఫోన్ లు
రెండు కత్తులు
రెండు ఇంచుల ప్లాస్టర్లు 
నిందితులు వదిలివేసిన బాధితుని కారు TS 01EF 0666

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..


ఈ కిడ్నాప్ రాష్ట్రం లో చాలా సంచలనం సృష్టించింది. కిడ్నాప్ ను కేవలం మూడు రోజుల్లో ఛేదించి నిందితులను పట్టుకోవటం జరిగిందని. జిల్లా పోలీసులు ప్రజల రక్షణ కోసం కట్టుబడి ఉన్నారని. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలుంటే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు న్యాయం చేస్తూ, నేరాలపై కఠినంగా వ్యవహరిస్తుందని.దినికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. 

కేసు ఛేదనలో ఏ.ఎస్పీ నిర్మల్ రాజేష్ మీన, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్ రెడ్డి, కృష్ణ, సమ్మయ్య, ఎస్ఐలు ప్రదీప్,  శ్రీనివాస్, లింబాద్రి, శ్రీకాంత్, అశోక్, హెడ్ కానిస్టేబుల్ తాహేర్ ఖాన్,కానిస్టేబుల్స్ రాజేందర్, ముత్యం,సంతోష్,రాజు, సాయి కృష్ణ, ప్రవీణ్ దయాకర్,రమేష్, రాజ్ కుమార్, హోమ్ గార్డులు తక్కన్న,తిరుపతి,రమణ లను టీం లు చాకచక్యంగా పని చేశారు. వీరిని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ప్రత్యేకంగా అభినందించారు. 

నిందితుల వివరాలు:

1.  షేక్ హైదర్ నివాసం పొంకల్, 
2.  బనాల ప్రిన్స్ నివాసం గుంటూరు
3.  తట్టురి రవి నివాసం విజయవాడ 
4.  కళకంటి సురేష్ నివాసం విజయవాడ 
5.  గూడె కోటేశ్వర రావు నివాసం విజయవాడ
6. మధుసూదన్ (పొనకల్)

Tags:

About The Author

Advertisement

Latest News