తనువు మనస్సు ఆత్మను ఏకం చేసేది యోగా - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్... 

తనువు మనస్సు ఆత్మను ఏకం చేసేది యోగా - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్... 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా ఆయుష్ శాఖ,పతంజలి వారు వేరువేరుగా శ్రీరామ గార్డెన్ మరియు  మున్నూరుకాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవం 2025 కార్యక్రమంలో  ముఖ్యఅతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు..ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రతి కుటుంబం రోజువారీ దినచర్యలో యోగాను జోడించుకోవాలని పిలుపునిచ్చారు.తనువు, మనసు, ఆత్మను ఏకం చేసే సాధనమే యోగ అన్నారు. యోగ మన ప్రాచీన సాంప్రదాయం నుండి వచ్చిన ఒక అమూల్యమైన బహుమతిని నేటి తరానికి అందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 11సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా దేశమంతా  యోగ ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఒక లక్ష ప్రాంతాలలో భారీ యోగ ప్రదర్శనలు నిర్వహిస్తుందన్నారు.
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆరోగ్య భద్రతా విషయంలో ప్రాచీనమైన యోగను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత  మన దేశానికి దక్కుతుందన్నారు.
2014 మన భారత ప్రధానమంత్రి మోడీ గారి కృషి ఫలితంగా ఐక్యరాజ్యసమితి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందన్నారు.
2015 న్యూఢిల్లీలో మొట్టమొదటిసారిగా జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకొని రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించిన విషయాన్నీ గుర్తు చేసారు.
యోగా యొక్క మూలకర్త మరియు సృష్టికర్తగా ఆ పరమశివున్ని చెప్పవచ్చని మునులు, ఋషుల కాలం నుండి దాదాపు 5 వేల సంవత్సరాలనుండి యోగ అనేది మన దేశంలో ఆచరిస్తూ వస్తున్నమన్నారు.
వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి యోగ ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు.యోగా సాధనతో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం మరియు ఆరోగ్యాన్ని పొందవచ్చని ఒత్తిడి ఆందోళన మరియు నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో యోగ అద్భుతంగా సహాయపడుతుందన్నారు.సీనియర్ సిటిజన్లు, మధుమేహరోగులు, గర్భిణీ స్త్రీలు, మారకద్రవ్యలకు బానిసలైన వారు బయటపడటానికి చికిత్స తీసుకుంటున్న వ్యక్తులకు యోగ ఒక వరంలా పనిచేస్తుందన్నారు..
ఇందూర్ జిల్లాను కూడా యోగ ప్రదర్శనలో మొదటి స్థానంలో రికార్డ్ సాధించే  విదంగా అందరం కృషి చేయాలనీ సూచించారు.అనంతరం పోలీస్ కమీషనర్ సాయి చైతన్య, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మినారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా పలువులు ప్రముఖులతో కలిసి యోగ ఆసనాలు వేశారు.

Tags:

About The Author

Advertisement

Latest News

సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా... సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
  ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది... జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి... నిజామాబాద్,(లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...
రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం 
సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ...