విద్యార్థులకు ముత్తు పదార్థాల పై అవగాహన సందస్సు
విద్యార్థులకు మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కోసం మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ డి. జానకి
జడ్చర్ల :(లోకల్ గైడ్):
మత్తు పదార్థాలు నిర్మూలన అవగాహన వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం, జడ్చర్లలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి. జానకి, పాల్గొన్నారు పాఠశాల విద్యార్థులు మరియు యువత తో కలిసి మొక్కలు నాటడం జరిగింది.
అనంతరం ఎస్పీ మాదకద్రవ్యాల నిర్మూలన గురించి విద్యార్థులకు, యువతకు నిర్మూలనపై అవగాహన కల్పించారు.మొక్కలు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు మాదకద్రవ్యాల జోలికి వెళ్ళకండి అనే నినాదంతో ఒక సామాజిక సందేశాన్ని అందించారు.పర్యావరణ పరిరక్షణతో పాటు మాదకద్రవ్యాల నివారణ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలి. యువతలో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి మొక్క మన భవిష్యత్తుకు ఆధారం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మనసును ప్రశాంతంగా మార్చుకోవాలి. మానవ జీవితాన్ని నాశనం చేసే వినాశకారక మార్గం. అలాంటి దారి వైపు డుగులు వేయరాదని అన్నారు కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, బుచ్చయ్య, డీఎస్పీ గిరిబాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, డిటిసి ఇన్స్పెక్టర్ రవి కుమార్, ఆర్ ఐ అడ్మిన్ కృష్ణయ్య, రమేష్, బాలానగర్, రాజపూర్, జడ్చర్ల,, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.