రాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీసులపై మద్యం మత్తులో దాడి...

రాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీసులపై మద్యం మత్తులో దాడి...

నలుగురు యువకులు అరెస్ట్...

విధుల్లో ఉన్న పోలీసులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు..

. * నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో దోన్‌కల్ గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడ్డ ఘటన హత్యాయత్నం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేపింది.
రాత్రి ఒంటి గంట సమయంలో భీంగల్ సర్కిల్ పరిధిలోని ఐడీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు తోపరపు వినయ్ (పి.సి. -2431, ఏర్గట్ల పోలీస్ స్టేషన్ మరియు శౌకత్ అలీ (పి.సి-1786, మోర్తాడ్ పోలీస్ స్టేషన్)లు నైట్ క్రైమ్ బీట్ సందర్భంగా డోన్‌కల్ శివారులోని రాజస్థాన్ ఢాబాలో అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను గమనించారు. వారు తమను పోలీసులని తెలియజెప్పగానే నిందితులు అసభ్య పదజాలంతో తిడుతూ, శారీరక దాడికి పాల్పడ్డట్టు తెలిసింది...అయితే దాడికి పాల్పడ్డ నిందితులు దలమల్క భూపతి మరియు నూతికట్టు శివ కుమార్,నూతికట్టు శ్రీవర్ధన్,తోపారం శశి శేఖర్ లుగా పోలీసులు గుర్తించారు.. శశి శేఖర్ తన జన్మదిన వేడుక సందర్భంగా మద్యం సేవించి మిగతా స్నేహితులతో కలిసి దాబాకు వచ్చినట్టు విచారణలో వెల్లడైంది. సంఘటనను గమనించిన దాబా సిబ్బంది హరిరాం, నారాయణారాం నిందితులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, వారు అక్కడి నుంచి కారులో పరారయ్యారు.దీనిపై బాధిత కానిస్టేబుల్ వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోర్తాడ్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్.105/2025, సెక్షన్లు 292, 132, 121(1), 109(1) r/w 3(5) BNS ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి  అనంతరం వారిని న్యాయస్థానానికి హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు, విధుల్లో ఉన్న పోలీసులపై దాడులను తీవ్రంగా పరిగణిస్తామని, ఇలాంటి దురాగతాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల రక్షణ కోసం పని చేస్తున్న పోలీసుల భద్రతను కాపాడడంలో ఎవ్వరినీ ఉపేక్షించబోమని పోలీస్ కమిషనర్ తో పాటు ఉన్నతాధికారులు హెచ్చరించారు.

Tags:

About The Author

Advertisement

Latest News