పది ఏండ్లు నిర్వీర్యం అయిన రేషన్ కార్డులు పేదల కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..

పది ఏండ్లు నిర్వీర్యం అయిన రేషన్ కార్డులు పేదల కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..

▪️ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయని ప్రభుత్వం బి.ఆర్.ఎస్ ప్రభుత్వం..

▪️పేద ప్రజలను బి.ఆర్.ఎస్ దగా చేసింది..

▪️కాంగ్రెస్ సర్కారు పేదల పక్షపాతి..

▪️రైతన్నల మొహంలో చిరునవ్వు చూడటమే మా లక్ష్యం..

పెద్దపెల్లి-- లోకల్ గైడ్

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్.కే గార్డెన్స్ లో పెద్దపల్లి మండలం మరియు పట్టణానికి సంబంధించిన 480 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను స్థానిక తహసీల్దార్ మరియు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది...ఈ సందర్భంగా మాట్లాడుతూ..పది సంవత్సరాలు బి.ఆర్.ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన రేషన్ కార్డులను మన ప్రజా ప్రభుత్వం అధికారంలోని వచ్చాక మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా పాలన అనే కార్యక్రమంతో పేద ప్రజలకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. గత బి.ఆర్.ఎస్ పార్టీ పేద ప్రజలను మోసం చేస్తూ సంక్షేమం విషయంలో ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. అలాగే పది ఏండ్లు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ మేలు చేస్తోందని అన్నారు. రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేసే బియ్యంపై చాలా పేద కుటుంబాలు ఆధారపడి ఉంటాయని వారికి తీవ్ర అన్యాయం చేసిన ఘనత బి.ఆర్.ఎస్ ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి సన్న బియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని గుర్తు చేశారు. రేవంతన్న సర్కార్ విద్యా మరియు వైద్యంపై చిత్తశుద్ధితో పని చేస్తుందని అలాగే 5 లక్షలు ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి పేద ప్రజల వైద్యానికి తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి మహిళామణులకు మేలు చేస్తున్నామని పెద్దపల్లి చిరకాల స్వప్నం అయిన బస్సు డిపోను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మంజూరు చేయించుకోవడం జరిగిందని త్వరలో బస్సు డిపో పనులు ప్రారంభించుకోవడం జరుగుతుందని అలాగే కాంగ్రెస్ సర్కార్ రైతన్నలకు వెన్నంటే ఉందని రైతు భరోసా ద్వారా రైతన్నల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయడం జరిగిందని రైతు మొహంలో చిరునవ్వు చూడటమే మా ద్వేయం అని అన్నారు. రైతులు పండించిన పంటలో కూడా తరుగు పెట్టి రైతుల నడ్డి విరిచిన ప్రభుత్వం బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మన నియోజకవర్గంలో ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతన్నల మొహంలో చిరునవ్వు చూశామని తెలిపారు. మన పెద్దపల్లి నియోజకవర్గంలో వడ్ల బోనస్ ఘనియంగా జమ చేయడం మనకు గర్వకారణం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని వేళల ప్రజల మద్దతు ఉండాలని ఎమ్మెల్యే విజయరమణ రావు కోరారు.

Tags:

About The Author

Advertisement

Latest News

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా.  ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
నేను సైతం.    -మన్నెంలో 'రాహుల్ రేలా'                                             -అడవి బిడ్డలకు కొండంత అండ.                          -గిరిజన ప్రగతికి కీలక అడుగులు.                            -పదునైన ప్రణాళికలతో ఫలితాలు.                          -ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్...
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్
స్ట్రాబెర్రీలు.. చిన్న పండ్లు, గొప్ప లాభాలు!
మహేష్‌ బాబు డెడికేషన్‌ నాకు పాఠం లాంటిది: త్రిష
రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ వివాహం వాయిదా!
ఎమ్మెల్యే నాయిని కి కృతజ్ఞతలు