అద్వానంగా మారిన

అద్వానంగా మారిన

అక్కన్నపేట-జనగాం రహదారి 

*తక్షణమే రోడ్డు మరమ్మత్తుపై అధికారులు దృష్టి సారించాలి

*ప్రమాదకరంగా మారిన చిన్న బ్రిడ్జిని విస్తరించాలి


 లోకల్ గైడ్, హుస్నాబాద్: హుస్నాబాద్ నుండి అక్కన్నపేట, జనగాం వెళ్లే రహదారి అద్వానంగా తయారైంది. ముఖ్యంగా ఈ రహాదారి కంకర తేలి గుంతలు పడి రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందిగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. దీనికి తోడు ప్రధాన రహదారి మార్గంలోఉన్న  బ్రిడ్జి మరింత అసౌకర్యంగా పరిణమించింది. అసలే వాహనదారులు రద్దీ అధికంగా ఉండే ఈ మార్గంలో చిన్న వంతెన కారణంగా  వాహనదారులు అనేక  ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారు. ఈ మెయిన్ రోడ్ పెద్ద పెద్ద  గుంతలు పడినా మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాహనచోధకులు మండిపడుతున్నారు.ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు మారుతున్నా  కానీ ఈ వంతెన గురించి పట్టించుకునే వారు లేరని వాహనదారులు, బాటసారు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ రోడ్డు గుండానే తమ గమ్యస్ధానాలకు  వెళుతుం టారు. దీంతో  వారి కాన్వాయ్ వల్ల కూడా, ఇతర వాహన దారులకు మరింత ఆలస్యం, అసౌకర్యంగా మారింది. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా ఈ చిన్న వంతెనను మరింత విస్తరించాలని ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని స్ధానికులు, వాహన దారులు కోరుతున్నారు. మెయిన్ రోడ్ మరమ్మతు చేయడంతో పాటుగా,అటు, ఇటు రాకపోకలు సాగే విధంగా సమీపానే మరో వంతెన ఏర్పాటు చేయాలని, తద్వారా వాహనదారుల కష్టాలు తీరతాయని పలువురు పేర్కొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా.  ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
నేను సైతం.    -మన్నెంలో 'రాహుల్ రేలా'                                             -అడవి బిడ్డలకు కొండంత అండ.                          -గిరిజన ప్రగతికి కీలక అడుగులు.                            -పదునైన ప్రణాళికలతో ఫలితాలు.                          -ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్...
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్
స్ట్రాబెర్రీలు.. చిన్న పండ్లు, గొప్ప లాభాలు!
మహేష్‌ బాబు డెడికేషన్‌ నాకు పాఠం లాంటిది: త్రిష
రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ వివాహం వాయిదా!
ఎమ్మెల్యే నాయిని కి కృతజ్ఞతలు