పాన్ ఇండియా సినిమాల పరిస్థితి .......

పాన్ ఇండియా సినిమాల పరిస్థితి .......

ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు భారీగా వస్తున్నాయి. కోట్ల రూపాయల బడ్జెట్‌తో షూటింగులు, చివరి నిమిషం వరకు దర్శకుడు నిద్ర లేకుండా సరిచిద్దడం… ఇవన్నీ విభిన్న భాషల తలనొప్పులే. అయినా, ఇలాంటివి పది సినిమాల్లో ఒకటంటే ఒకటి మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఆడుతోంది.అందుకే, సినిమా బైలింగ్వల్‌గా (రెండు భాషల్లో) తీసి, ఆ తర్వాత రిస్పాన్స్‌ చూసుకుని హిందీలో విడుదల చేయడం సేఫ్ ప్లాన్‌గా చెబుతున్నారు.తాజా ఉదాహరణగా కుబేరాను చూడండి. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా తీసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత తెలుగు థియేటర్లకు ‘హౌస్‌ఫుల్’ బోర్డులు తిరిగి వచ్చాయి. కానీ తమిళనాడు ప్రేక్షకులు ఈ సినిమాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. డబ్బింగ్ కూడా క్వాలిటీగా చేసినా, ధనుష్‌ లాంటి ప్రతిభావంతుడు కూడా తమిళలో అదే రేంజ్‌లో ఆకర్షించలేకపోయాడు.ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్లు ఇలా ఉన్నాయి : మొత్తం రూ. 56 కోట్లలో తెలుగు నుంచే రూ. 21.5 కోట్లు వచ్చాయి. తమిళ నుంచి కేవలం రూ. 9 కోట్లు మాత్రమే. అసమానత స్పష్టంగా కనిపిస్తోంది. కన్నడలో అయితే పరిస్థితి మరీ దారుణం — మొదటి రోజే కేవలం 2 లక్షలు, ఆదివారానికి కలిపి 5 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయి.రష్మికకు సంబంధించిన పాత వివాదాలు, బహిష్కరణ పిలుపులు కూడా కన్నడ కలెక్షన్‌పై ప్రభావం చూపినట్లు అనిపిస్తోంది. హిందీ లో కూడా రెండు రోజుల్లో కేవలం 0.5 కోట్లే వచ్చాయి. హిందీ ప్రేక్షకులు ఇప్పుడు పుష్ప 2 లాంటి డేర్ & బోల్డ్ కథలను కోరుకుంటున్నారు. శేఖర్ కమ్ముల వారి క్లాస్ స్టోరీ అక్కడ పని చేయలేదు.ఇక బీ, సీ సెంటర్లలో ఏ విధంగా నిలబడుతుందో చూడాలి. మొత్తం మీద ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్‌లో నడుస్తున్నది శేఖర్ కమ్ములకు ఉన్న క్రేజ్ వల్లే. తమిళనాడులో ధనుష్ స్టార్‌డమ్ కూడా ప్రయోజనం కలిగించలేదు. రష్మిక నేషనల్ క్రష్ ఇమేజ్ కూడా కన్నడ, హిందీలో పని చేయలేదు.పాన్ ఇండియా సినిమా అంటే పెట్టుకోవడం కంటే, బైలింగ్వల్ గా ప్లాన్ చేసి తర్వాత మార్కెట్ రియాక్షన్‌ ఆధారంగా ఇతర భాషల్లో విడుదల చేయడం డబ్బులు, శ్రమ రెండింటినీ ఆదా చేస్తుంది!

Tags:

About The Author

Advertisement

Latest News

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా.  ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
నేను సైతం.    -మన్నెంలో 'రాహుల్ రేలా'                                             -అడవి బిడ్డలకు కొండంత అండ.                          -గిరిజన ప్రగతికి కీలక అడుగులు.                            -పదునైన ప్రణాళికలతో ఫలితాలు.                          -ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్...
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్
స్ట్రాబెర్రీలు.. చిన్న పండ్లు, గొప్ప లాభాలు!
మహేష్‌ బాబు డెడికేషన్‌ నాకు పాఠం లాంటిది: త్రిష
రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ వివాహం వాయిదా!
ఎమ్మెల్యే నాయిని కి కృతజ్ఞతలు