నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ UGC NET జూన్ - 2025 సందర్బంగా అండర్ సెక్షన్ 163 BNSS అమలు
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి...
నిజామాబాద్ ,లోకల్ గైడ్ :
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యుజిసి నెట్ జూన్ - 2025 కోసం జిల్లా లోని నిజామాబాదు డివిజన్ లోని పరీక్ష కేంద్రం వద్ద ఈనెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు మల్టి షిఫ్ట్ ప్రకారం పరీక్షలు గలదు. ఏవీ ఎంటర్ ప్రైజెస్, మున్నూరు కాపు సంఘము, అర్సపల్లి బై పాస్ రోడ్డు , నిజామాబాద్ లో పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య నిషేధిత ఆదేశాలు జారీ చేశారు.
కావున నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిరోధించాలనే ఉద్దేశ్యంతో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య అండర్ సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని తెలియచేసారు.
అండర్ సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమి కూడరాదు. నిషేదిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరుగరాదని తెలిపారు.. పరీక్షా కేంద్రాo పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ సెంటర్లను తేది: 25-06-2025 నుండి తేది: 29-06-2025 వరకు (ఉదయం 07:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు) మూసివేయాలి.నిషేధిత ఉత్తర్వులు తేది : 25-06-2025 నుండి తేది: 29-06-2025 వరకు ఉదయం 07:00 నుండి సాయంత్రం 6:00 వరకు అమలులో ఉంటాయని తెలిపారు..