అమ్మ పేరుమీద ప్రతి ఒక్కరు మొక్కనాటాలి - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్... 

అమ్మ పేరుమీద ప్రతి ఒక్కరు మొక్కనాటాలి - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్... 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్  గైడ్) భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్బంగా దుబ్బ చౌరస్తాలో నిర్వహించిన మొక్కల పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ  పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు జనసంఘ్ వ్యవస్థాపక స్థాపకులైన ముఖర్జీ దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునరనిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో BJS స్థాపించడం జరిగిందన్నారు.
జాతి ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకంచారన్నారు.ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహి ఛాలెంగే (ఒకే దేశానికి రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు మరియు రెండు జాతీయ చిహ్నలు ఉండకూడదన్నారు నరేంద్రమోదీ గారు ముఖర్జీ ఆశయాలకు, ఆకాంక్షాలకు అనుగుణంగా 370 ఆర్టికల్ రద్దుచేసి కాశ్మీర్ ను సుందరికరణ చేయడాన్ని మనం చూస్తున్నాం అన్నారు.ముఖర్జీ పార్టీ కోసం అహర్నిశలు శ్రామిస్తూ తన జీవితాన్నే అంకితం చేసి అతని మరణం కూడా నిర్భంధం లోనే ఒక మిస్ట్రీగా మిగిలిపోయిందన్నారు.
ఆ మహనీయుని త్యాగానికి గుర్తుగా బలిదాన్ దివస్ జరుపుకుంటున్నాం అని తెలియజేసారు.బలిదాన్ దివస్ ఈ కార్యక్రమంలో భాగంగా పెరుగుతున్న కాలుష్యన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు అమ్మపేరుమీద ఒక్క మొక్కను నాటలని పిలుపునిచ్చారు.
అనంతరం మహిళలకు ఎమ్మెల్యే  మొక్కలు పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచ రెడ్డి ప్రవళిక ,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి , దుబ్బ మండల అధ్యక్షులు గడ్డం రాజు, ఇంటలెక్చువల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ కొండా ఆశన్న , తాజా మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ , మహిళా మోర్చా మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా.  ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
నేను సైతం.    -మన్నెంలో 'రాహుల్ రేలా'                                             -అడవి బిడ్డలకు కొండంత అండ.                          -గిరిజన ప్రగతికి కీలక అడుగులు.                            -పదునైన ప్రణాళికలతో ఫలితాలు.                          -ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్...
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్
స్ట్రాబెర్రీలు.. చిన్న పండ్లు, గొప్ప లాభాలు!
మహేష్‌ బాబు డెడికేషన్‌ నాకు పాఠం లాంటిది: త్రిష
రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ వివాహం వాయిదా!
ఎమ్మెల్యే నాయిని కి కృతజ్ఞతలు