‘డొక్కా సీతమ్మ’ లాంటి సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి : మురళీ మోహన్ 

‘డొక్కా సీతమ్మ’ లాంటి సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి : మురళీ మోహన్ 

లోక‌ల్ గైడ్: మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా ఉషారాణి మూవీస్ బ్యానర్ మీద వల్లూరి రాంబాబు , మట్టా శ్రీనివాస్ నిర్మాతలుగా టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తిక్ కోడకండ్ల సంగీతాన్ని అందించారు. ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. గతంలో రిలీజ్ చేసిన మూవీ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మురళీ మోహన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను, గ్లింప్స్ నీ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో..మురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘నా పుట్టిన రోజుని ఎప్పుడూ కూడా ఆశ్రమాల్లో చేసుకుంటూ ఉంటాను. దివ్యాంగులు, వృద్దాశ్రమాలు, అనాథాశ్రమాల్లో సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు కూడా అంధుల ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఓ అరగంట వచ్చి వెళ్లండని ‘డొక్కా సీతమ్మ’ టీం పిలిచింది. అందుకే ఇలా వచ్చాను. చిన్న నిర్మాతలే అయినా నా బర్త్ డేను ఇలా సెలెబ్రేట్ చేస్తున్నందుకు థాంక్స్. రేలంగి గారితో నా అనుబంధం మరువలేనిది. రామ సత్యనారాయణ గారు ఎంతో మంది నిర్మాతలకు అండగా నిలుస్తుంటారు. డొక్కా సీతమ్మ గారి మీద సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కాటన్ దొర గారు సైతం డొక్కా సీతమ్మ గారిని పొగిడారు. సన్మానం చేస్తామని లండన్‌కు రమ్మని పిలిస్తే సైతం డొక్కా సీతమ్మ గారు వెళ్లలేదు. 'నేను అక్కడికి వస్తే ఇక్కడ వారి ఆకలి ఎవరు తీరుస్తారు?' అని డొక్కా సీతమ్మ గారు నిరాకరించారు. అలాంటి ఓ గొప్ప మనిషి మీద సినిమాను తీస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడు అంతా కమర్షియల్‌గా మారింది. అలాంటి టైంలో రాంబాబు, రవి నారాయణ గారు ముందుకు వచ్చారు. ఇలాంటి చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.

దర్శకుడు టి.వి. రవి నారాయణ్ మాట్లాడుతూ .. ‘నా మొదటి హీరో మురళీ మోహన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ కథను చేయాలని మురళీ మోహన్ గారు చెప్పిన క్షణం నుంచీ ఇప్పటి వరకు ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆయన వల్లే ఈ మూవీ ఇక్కడి వరకు వచ్చింది. ఆయన సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని అన్నారు.
దాసన్న మాట్లాడుతూ .. ‘డొక్కా సీతమ్మ సినిమా నుంచి రిలీజ్ చేసిన మురళీ మోహన్ గారి ఫస్ట్ లుక్ బాగుంది. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ .. ‘మురళీ మోహన్ గారి లాంటి గొప్ప వ్యక్తి నటిస్తున్న చిత్రానికి నేను పని చేస్తుండటం ఆనందంగా ఉంది. డొక్కా సీతమ్మ గారు అంటే ధర్మం.. ధర్మం అంటే మురళీ మోహన్ గారు. ఇలాంటి గొప్ప చిత్రంలో పని చేసే అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అని అన్నారు. 
శివ నాగు మాట్లాడుతూ .. ‘మురళీ మోహన్ గారు డొక్కా సీతమ్మ చిత్రంతో మరో విజయాన్ని అందుకోబోతోన్నారు. నేను త్వరలోనే ఆయన్ను డైరెక్ట్ చేయబోతోన్నాను. ఆయన మహా నటులు’ అని అన్నారు.
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ .. ‘‘మురళీ మోహన్ గారు ప్రతీ రంగంలో విజయాన్ని సాధించారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయనెప్పుడూ కూడా సర్వేజనా సుఖినోభవంతు అని అంటుంటారు. అందుకే ఆయన అంత ఆరోగ్యంగా ఉంటారు’ అని అన్నారు.
ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ .. ‘నాలుగు పాటలు, ఫైట్లు అంటూ సినిమాలు తీస్తున్న టైంలో ఇలా డొక్కా సీతమ్మ గారి కథతో గొప్ప సినిమాను తీస్తున్నారు. ఇలాంటి చిత్రాలే ఇప్పుడు రావాలి. నా వెన్నెంటే ఉండే మా మురళీ మోహన్ గారికి మరోసారి ఈ చిత్రంతో పెద్ద విజయం చేకూరాలి’ అని అన్నారు.
ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ .. ‘నా కెరీర్ ప్రారంభం నుంచీ మురళీ మోహన్ గారు నాకు సపోర్ట్‌గా నిలుస్తూనే వచ్చారు. నాకు జీవితంలో ఆయనే స్పూర్తి. ఆయన సినీ, వ్యాపార, రాజకీయ రంగాల్లో విజయాన్ని సాధించారు. ఈ డొక్కా సీతమ్మ గారి సినిమాతో ఆయనకు మరో విజయం దక్కాలి’ అని అన్నారు.
రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ..‘డొక్కా సీతమ్మ గురించి మేం చదువుకునే రోజుల్లో చాలా విన్నాం. ఇక ఆమె కథతో సినిమా తీస్తున్నారని తెలియడంతో ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచీ ఆయన నాకు సపోర్ట్‌గానే నిలిచారు. ఇండస్ట్రీలో మంచితనం అంటే సూపర్ స్టార్ కృష్ణ, మురళీ మోహన్ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. మా గురువు దాసరి గారు అయితే మురళీ అంటూ కొడుకుని పిలిచినట్టుగా ప్రేమగా పిలుస్తుండేవారు’ అని అన్నారు.

Tags:

About The Author

Latest News

ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ద్విశతకంతో ఆకట్టుకున్న టీమ్ ఇండియా స్టార్ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్, ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఏడో స్థానానికి...
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0తో ఉద్యోగాల సృష్ఠి: మ‌ంత్రి లోకేశ్
స్వర్ణాంధ్ర విజన్–2047కు సంపూర్ణ మ‌ద్ద‌తు....
 గోదావ‌రి పుష్క‌రాల‌పై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం, ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు....
శ్రీ భద్ర కాళి దేవస్థానంలో 15 రోజుల పాటు జరిగే శాకంభరీ నవరాత్ర మహోత్సవములు
చేతి వృత్తి వస్తువుల ప్రదర్శన/అమ్మకాలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, మంత్రులు
అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.