పది మంది యాత్రికుల ఆచూకీ గల్లంతు

 పది మంది యాత్రికుల ఆచూకీ గల్లంతు

లోక‌ల్ గైడ్: డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. భక్తులతో వెళ్తున్న ఓ టెంపో ట్రావెలర్ వాహనం అలనకంద నదిలో పడిపోవడంతో ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడగా, పది మంది ఇప్పటికీ అదృశ్యమయ్యారు.ఈ ఘటన రుద్రప్రయాగ్ – గౌచార్ మార్గంలో ఉన్న బద్రీనాథ్ జాతీయ రహదారిపై గోల్‌తిర్ గ్రామం వద్ద ఉదయం 7:30 గంటల సమయంలో చోటు చేసుకుంది

 

. వాహనంలో డ్రైవర్‌తో సహా మొత్తం 20 మంది యాత్రికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారు అంతా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నుంచి చార్‌ధామ్ యాత్రకు వచ్చిన భక్తులు.ప్ర‌మాదం సమాచారం తెలుసుకున్న వెంటనే రిలీఫ్, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఇప్పటివరకు రెండు మృతదేహాలను నదిలో నుంచి వెలికితీశారు. ఒక మృతదేహాన్ని రుద్రప్రయాగ్ సమీపంలో గుర్తించారు. గాయపడినవారిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి సత్యేంద్ర సింగ్ భండారి తెలిపారు.ప్రస్తుతం నదిలో మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం వర్షాల వల్ల జారుడు నేలగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు సమీప ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేశారు.

Tags:

About The Author

Latest News

బోనాలు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక* బోనాలు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక*
లోక‌ల్ గైడ్:తెలంగాణ కుమ్మర్ల  గోల్కొండ బోనాల ఉత్సవ సమితి అద్వైర్ర్యంలో జూన్ 26 నాడు గోల్కొండలో శ్రీశ్రీ శ్రీ జగథాంభిక అమ్మ వారికి బోనం దూప దీప...
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం
ఎస్‌సీవో డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయ‌ని రాజ్‌నాథ్ సింగ్‌
 పది మంది యాత్రికుల ఆచూకీ గల్లంతు
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు వర్షాలు – బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం
విశాఖలో కొత్త ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న కాగ్నిజెంట్
రైలు పట్టాలపై కారు నడిపిన యువతి – రంగారెడ్డిలో కలకలం