ఎస్‌సీవో డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయ‌ని రాజ్‌నాథ్ సింగ్‌

ఎస్‌సీవో డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయ‌ని రాజ్‌నాథ్ సింగ్‌

లోక‌ల్ గైడ్ :క్వింగ్‌డావో (చైనా): షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశాల్లో రూపొందించిన సంయుక్త ప్రకటనపై భారత్ సంతకం చేయకుండా పక్కనపెట్టింది. ఈ ప్రకటనలో పెహల్గామ్ ఉగ్రదాడిపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం వల్లే, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

 


ఉగ్రవాదం అంశంపై జరిగిన చర్చల అనంతరం జాయింట్ డిక్లరేషన్ ముసాయిదా సమర్పించగా, భారత్ తమ అభిప్రాయాలు సరిగా ప్రతిబింబించలేదని అభ్యంతరం తెలిపింది. పెహల్గామ్ దాడి విషయాన్ని ఉద్దేశపూర్వకంగా ఎస్‌సీఓ డాక్యుమెంట్‌ నుంచి తొలగించడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో భారత్ ఆ సంయుక్త ప్రకటనపై సంతకం చేయకుండానే దూరంగా నిలిచింది.భారత ప్రభుత్వం ఇప్పటికే పెహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్థాన్‌కు సంబంధం ఉందని ఆరోపిస్తూ, దీనిపై అంతర్జాతీయంగా దృష్టి సారించాలని కోరుతోంది.అదే సమయంలో SCO డిక్లరేషన్‌లో మాత్రం బలూచిస్తాన్‌లో జరిగిన ఉగ్రదాడి, అలాగే మార్చిలో హైజాక్‌కు గురైన జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఘటనను ఖండిస్తూ ప్రస్తావనలుంటే, పెహల్గామ్ దాడి విషయంలో మౌనం పాటించడం భారత అధికారుల అసంతృప్తికి దారి తీసింది.భారత బృందం తమ అభిప్రాయాలను తీవ్రంగా వ్యక్తం చేయడంతో, చివరకు ఆ డిక్లరేషన్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని సమాచారం.

Tags:

About The Author

Latest News

బోనాలు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక* బోనాలు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక*
లోక‌ల్ గైడ్:తెలంగాణ కుమ్మర్ల  గోల్కొండ బోనాల ఉత్సవ సమితి అద్వైర్ర్యంలో జూన్ 26 నాడు గోల్కొండలో శ్రీశ్రీ శ్రీ జగథాంభిక అమ్మ వారికి బోనం దూప దీప...
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం
ఎస్‌సీవో డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయ‌ని రాజ్‌నాథ్ సింగ్‌
 పది మంది యాత్రికుల ఆచూకీ గల్లంతు
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు వర్షాలు – బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం
విశాఖలో కొత్త ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న కాగ్నిజెంట్
రైలు పట్టాలపై కారు నడిపిన యువతి – రంగారెడ్డిలో కలకలం