మహబూబాబాద్ లో ఏసీబీ వలలో విద్యుత్ శాఖ జిల్లా అధికారి 

మహబూబాబాద్ లో ఏసీబీ వలలో విద్యుత్ శాఖ జిల్లా అధికారి 

మహబూబాబాద్ (లోకల్ గైడ్)

రాష్ట్రంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఒక్కొక్కరిగా ట్రాప్ చేస్తూ అవినీతి తిమింగాళాలకు దడ పుట్టిస్తున్నారు. బుధవారం  ఉదయం లంచాలకు మరిగిన అవినీతి అధికారిని ట్రాప్ చేసి పట్టుకున్నారు అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న విద్యుత్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. హస్తినాపురం కాలనీలో విద్యుత్ అధికారి j.నరేష్ ఏసీబీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. 80 వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు నరేష్. దీంతో నరేష్ ఇంట్లో ఎసీబీ సోదాలు కొనసాగుతునాయి. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ ను లంచం డిమాండ్ చేయడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు. నరేష్ పట్టుబడటంతో అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. లంచానికి మరిగి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన సమాచారంతో ఇంట్లో పలు డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలను తనిఖీ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:

About The Author

Advertisement

Latest News

*ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.. *ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు...
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యేను ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ...
ఈనాటి బాలలే రేపటి పౌరులు
అలరించిన చిరుతల   రామాయణం
పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్న టీఎస్ ఆర్టిసి
సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన
కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్  సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ