ఉత్తరాదిలో వరద బీభత్సం:

ఉత్తరాదిలో వరద బీభత్సం:

 హిమాచల్‌ ప్రదేశ్‌లో ఐదుగురు మృతి

దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి.కాంగ్రా, కులు జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ వరదల్లో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. ధర్మశాలా ప్రాంతాలు కూడా వరదలతో ముంపునకు గురయ్యాయి. ఈ ఆకస్మిక వరదల్లో పలువురు కొట్టుకుపోయినట్లు కాంగ్రా పోలీస్ సూపరింటెండెంట్ షాలిని అగ్నిహోత్రి తెలిపారు.ఎస్‌డీఆర్‌ఎఫ్‌, స్థానిక పోలీసులు, హోం గార్డ్స్ రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు సుమారు 250 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.“కొంతమంది వరదల్లో కొట్టుకుపోయారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, స్థానిక పోలీసులు, హిమాచల్‌ హోం గార్డ్స్ సోదరుల సహకారంతో సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నిన్న రెండు మృతదేహాలను, ఇవాళ మూడు మృతదేహాలను వెలికితీశాం. ఇంకా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి,” అని షాలిని అగ్నిహోత్రి వివరించారు.


Tags:

About The Author

Latest News

బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు
బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్ 
పూరిజగన్నాథున్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 
మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు 
ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు "తమ్ముడు" మూవీకి సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు
అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...