లోకల్ గైడ్
కర్ణాటక-కేరళ సరిహద్దులోని మలై మహాదేశ్వర వైల్డ్లైఫ్ డివిజన్లో ఘోర ఘటన జరిగింది. ఒక తల్లి పులి, నాలుగు కూనలు కలిపి ఐదు పులులు మృతి చెందాయి. ఈ ప్రాంతంలో ఒక ఆవు కళేబరాన్ని కూడా అటవీ అధికారులు గుర్తించారు.
విషం వల్లే పులులు మృతి చెందినట్లు అనుమానం. గుర్తు తెలియని వ్యక్తులు ఆవు కళేబరంలో విషం కలిపి ఉంచినట్టు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం చనిపోయిన ఆవును పులి చంపినట్లు అధికారులు గుర్తించారు. ఆ పగతోనే స్థానికులు ఈ విధంగా ఎర వేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
శవపరీక్షలో కూడా పులులు విషప్రయోగంతోనే చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తీవ్రంగా స్పందించారు. మూడు రోజుల్లోగా పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం
కర్ణాటకలో 563 పులులు ఉన్నాయి. పులుల సంఖ్యలో దేశంలో మధ్యప్రదేశ్ తర్వాత కర్ణాటక రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వం పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నా,
గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ పశువులను కాపాడుకోవడానికి మృగాలపై విషప్రయోగం చేస్తున్నారని అటవీ శాఖ గుర్తించింది.