జూలై 18న 'వీడే మన వారసుడు' చిత్రం విడుదల
By Ram Reddy
On
లోకల్ గైడ్ : రైతుల జీవితాలపై ఆధారపడి రూపొందిన సందేశాత్మక చిత్రం ‘వీడే మన వారసుడు’. రమేష్ ఉప్పు (RSU) కథ , స్క్రీన్ప్లే, మాటలు, పాటలు ,నిర్మాత, దర్శకత్వంతో పాటు హీరోగా కూడా నటించిన ఈ సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది. రమేష్ ఉప్పు (RSU)కు జోడిగా లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ నటించారు. అర్.ఎస్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపోందిన ఈ చిత్రానికీ శ్రీమతి యు.రమాదేవి సమర్పకురాలుగా వ్యవహారిస్తున్నారు. సమ్మెట గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్) కీలక పాత్రలు పోషించారు. జూలై 18న తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్ను అభినందించారు. కుటుంబం, రైతుల పోరాటం, యువతపై మాదకద్రవ్యాల ప్రభావం వంటి అంశాలను సమర్థవంతంగా చిత్రీకరించినందుకు ప్రశంసలు లభించాయి.
Tags:
About The Author
Latest News
27 Jun 2025 18:30:26
బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్