వస్తున్నాయ్ వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు..! 

వస్తున్నాయ్ వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు..! 

షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" 

 మాజీ ఎమ్మెల్యే "చౌలపల్లి ప్రతాప్ రెడ్డి" తో కలిసి జగన్నాథుడికి ప్రత్యేక పూజలు

 ఆర్టీసీ కాలనీలో పవిత్ర పూరి జగన్నాథ్ స్వామి రథోత్సవం 

 మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు  

 షాద్ నగర్ లోకల్ గైడ్ 
 
భక్తులను రక్షించడానికి .. మనలో మంచితనం పెంచడానికి విష భావాలు తొలిగించడానికి వస్తున్నాయ్.. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు.. అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్, స్థానిక మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని 8వ వార్డు 
ఆర్టీసీ కాలనీలో గల పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిని దర్శించుకున్న అనంతరం స్వామి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిలు మాట్లాడుతూ.. జగన్నాథ స్వామి రథచక్రాలతో ఈ నియోజకవర్గ ప్రజలు ఎల్లకాలం సుభిక్షంగా ఉండాలని కోరారు. రైతులు కర్షక కార్మికులు అన్ని వర్గాలు ప్రశాంతంగా జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు వారు పేర్కొన్నారు. పూరి జగన్నాథుడి ఉత్సవాలు పట్టణంలో ప్రతి ఏటా జరపడం ఎంతో గొప్ప విషయమని నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పూరి జగన్నాథుని ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లి దర్శించుకునే భాగ్యం లేని ఎంతోమంది నిరుపేద భక్తులు ఇతరులకు ఇక్కడ జరుగుతున్న వేడుకలు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిలు పేర్కొన్నారు. 

 కదిలాయ్ జగన్నాథుడి రథచక్రాలు.. 

పూరి జగన్నాథుడు ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలతో కలిసి రథాలపై ఊరేగింపుగా వెళ్లే ఉత్సవం. 
జగన్నాధ రథయాత్ర అనేది జగన్నాధస్వామికి చేసే ప్రసిద్ధమైన ఉత్సవం. ఈ యాత్రలో జగన్నాధస్వామితో పాటు ఆయన అన్న బలభద్రుని, చెల్లెలు సుభద్రాదేవిని కూడా పూజించి, ఊరేగిస్తారు.ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాడ శుధ్ధ విధియ రోజున ప్రారంభమై పట్టణంలో పలు పురవీధులలో సాగుతుంది. ఈ ఊరేగింపు కోసం విగ్రహాలను గర్భగుడిలో నుంచి బయటకు తీసుకొచ్చి రథయాత్రగా తీసుకెళ్తారు. ఆ తరువాత సుభద్ర , బలబద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరీ ఆలయానికి చేరటంతో ముగుస్తుంది. ఒరిస్సాలో అయితే ఇది 12 రోజులు పాటు జరిగే ఉత్సవం .ఈ యాత్రకి రెండు నెలలముందు నించే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి. పూరీలో జగన్నాథుని ఉత్సవ ప్రజా ఊరేగింపు సందర్భంగా, లక్షలాది మంది భక్తులు రథంలో జగన్నాథుడిని చూడటానికి పూరీని సందర్శిస్తారు.ఈ ఉత్సవం మాదిరిగానే ప్రపంచంలోని చాలా జగన్నాధ ఆలయాల్లో కూడా రథయాత్ర చేస్తుంటారు..

Tags:

About The Author

Latest News

బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు
బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్ 
పూరిజగన్నాథున్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 
మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు 
ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు "తమ్ముడు" మూవీకి సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు
అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...