- District News
- సదాశివపేటలో భక్తి పారవశ్యంగా జగన్నాథ రథయాత్ర ప్రత్యేక పూజలు చేసిన చింత సాయినాథ్
సదాశివపేటలో భక్తి పారవశ్యంగా జగన్నాథ రథయాత్ర ప్రత్యేక పూజలు చేసిన చింత సాయినాథ్
Published On
By Ram Reddy
సదాశివపేట పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి తనయుడు చింత సాయినాథ్ గారు పాల్గొని శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
దుర్గమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర బసవ సదన్ వరకు భక్తి శ్రద్ధలతో సాగింది. వేద మంత్రోచ్ఛారణలు, హరినామ సంకీర్తనలు, భజనలతో యాత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. రథాన్ని భక్తులు ఉత్సాహంగా లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా చింత సాయినాథ్ గారు మాట్లాడుతూ, జగన్నాథ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సనాతన ధర్మ విలువలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ సోము , నగేష్, ఇస్కాన్ ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
22 Jul 2026 17:20:17
సొసైటీ డైరెక్టర్ , ఆర్ఎంపి రమేష్ తండ్రి దశదిన కర్మకు హాజరు
