- District News
- టి ఆర్ ఎస్ ను బలోపేతం చేయాలి
టి ఆర్ ఎస్ ను బలోపేతం చేయాలి
జిల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్
Published On
By Ram Reddy
నారాయణపేట ఆగస్టు 17:
నర్సాపూర్ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన గ్రామ కమిటీ ఎన్నుకున్నారు.
నూతన కమిటీ గ్రామ అధ్యక్షుడిగా కే. పకీరప్ప, ఉపాధ్యక్షుడిగా టి. మహిపాల్, ప్రధాన కార్యదర్శిగా ఈ. కురుమయ్య, ఉపకార్యదర్శిగా కే. నర్సింలు, యూత్ అధ్యక్షుడిగా కర్రె నాగేష్, సోషల్ మీడియా ఇంచా ర్జిగా సి. లాలప్ప ఎన్నిక య్యారు.అదేవిధంగా మీటింగ్ నిర్వాహకులుగా కే.చంద్రప్ప,కే. నారాయణ, అనంతప్ప,డి.ఆనంద్ కుమార్ వ్యవహరించగా, గ్రామ సభ్యులుగా కే. చిన్న చంద్రప్ప,కే.హనుమంతు తదితరులు ఎన్నికయ్యా రు.నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ సభ్యులను తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షులు, నారాయణపేట నియోజకవర్గం ఇంచార్జి గవినోళ్ల శ్రీనివాస్ సన్మానిం చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి లో తెలంగాణ రక్షణ సేనను మరింత బలోపేతం చేయ డంతో పాటు ప్రజా సమస్య లను గుర్తించి వాటి పరిష్కా రానికి కృషి చేయాలని నూతన కమిటీ సభ్యులకు సూచించారు.
గ్రామ ప్రజలకు అందుబా టులో ఉంటూ వారి సమ స్యల పరిష్కారానికి నిరం తరం కృషి చేయాలని, యువతను భాగస్వామ్యం చేస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్య క్రమంలో గవినోళ్ల జనార్దన్, పల్లెబండ నర్సింలు, కేశవు లు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
ఫోటో రైట్ అప్:6.కమిటీ సభ్యులను అభినందించిన శ్రీనివాస్
_____________________
Tags:
About The Author
Related Posts
Latest News
29 Aug 2026 11:02:31
ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్లోని బండ్లగూడ జగీర్కు చెందిన 49 ఏళ్ల సర్జన్ను ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
